కొంత మంది తమ స్వలబ్ధి కోసం దేశంలోని మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారిలో కన్నడ నటుడు చేతన్ అహింసా ఒకరు. గత కొన్ని రోజులుగా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తిరుపతి వెంకన్న స్వామి దేవాలయాన్ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే అతడికి కేంద్రం షాక్ నిచ్చింది.
భారత దేశం స్వరమత సమ్మేళనం. హిందూ, ముస్లిం భాయి, భాయి అంటూ బతుకుతున్నారు. హిందువుల పండుగలను ఇతర మతస్తులు ఎంత గౌరవిస్తారో, ముస్లిం, క్రైస్తవుల పర్వదినాల సమయంలో కూడా హిందువులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. అయితే కొంత మంది.. తమ స్వప్రయోజనాల కోసం మత కల్లోలాలు రేపుతూ ఘర్షణలకు కారణమౌతున్నారు. ఫేమ్, నేమ్ కోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారిలో కన్నడ నటుడు చేతన్ అహింసా ఒకరు. గత కొన్ని రోజులుగా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే గతంలో ఓ మతాన్ని ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్ చేయగా.. రెండు మతాల మధ్య చిచ్చును రేపుతున్నాడన్న ఆరోపణలపై అతడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అయితే బెయిల్పై విడుదలైన చేతన్ మళ్లీ తన పంథాను కొనసాగించాడు. దీంతో అతడికి దిమ్మతిరిగే షాక్ నిచ్చింది కేంద్రం.
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. దళిత, గిరిజనుల హక్కుల కార్యకర్తగా చెప్పుకుంటున్న చేతన్ అహింసా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. 2022లో ఫిబ్రవరిలో హిజాబ్ కేసును విచారిస్తున్న కర్ణాటక హైకోర్టు జడ్జి కృష్ణ దీక్షిత్పై అభ్యంతరకర ట్వీట్ చేశారు. ఆ సమయంలో కూడా అతడు అరెస్టు అయ్యి బెయిల్ పై విడుదలయ్యాడు. తాజాగా ఓ కేసులో అరెస్టు అయ్యి బెయిల్ పై విడుదలైన ఆయన.. తన పంథాను మార్చుకోలేదు. మొన్నటికి మొన్న తిరుపతి వెంకన్నపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా అన్నారో లేదో అలా అతడికి కేంద్రం షాక్ నిచ్చింది. చేతన్ కుమార్ అహింసా హిందూత్వ వ్యతిరేక వ్యాఖ్యపై బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత అతడి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (OCI) కార్డును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని అహింసా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
శనివారం, చేతన్ కుమార్ అహింసా ట్వీట్ చేస్తూ, ‘కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిన్న (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉండటానికి నా వీసాను రద్దు చేసింది’అని పేర్కొన్నారు. వీసా రద్దు చేసిన కేంద్ర హోం శాఖ కార్యాలయం అధికారులు.. ఎఫ్ఆర్ఆర్ ద్వారా చేతన్కు లేఖ పంపించి 15 రోజుల లోపు ఓసీఐ కార్డు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కన్నడ హీరో చేతన్ ఓసీఐ రద్దు చేస్తూ మార్చి 28వ తేదీన కేంద్ర హోం శాఖ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. తరువాత ఆదేశాల పత్రాలను ఎఫ్ఆర్ఆర్ ద్వారా పంపించడంతో ఏప్రిల్ 14వ తేదీన హీరో చేతన్ కు ఆ పత్రాలు అందాయని సంబంధిత అధికారులు అంటున్నారు.సీఐ వెనక్కు ఇచ్చినట్లు అయితే దేశ బహిష్కరణకు గురైనట్లే.