కొంత మంది తమ స్వలబ్ధి కోసం దేశంలోని మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వారిలో కన్నడ నటుడు చేతన్ అహింసా ఒకరు. గత కొన్ని రోజులుగా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తిరుపతి వెంకన్న స్వామి దేవాలయాన్ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే అతడికి కేంద్రం షాక్ నిచ్చింది.