టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఆ తర్వాత.. వరుస సినిమాలు చేస్తూ.. దక్షిణాదిన టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. టాలీవుడ్లో, సౌత్లోని మిగతా అన్ని ఇండస్ట్రీల్లో టాప్ హీరోలందరి సరసన నటించింది. కెరీర్ పీక్స్లో ఉండగానే గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 19న కుమారుడు నీల్ కిచ్లూకి జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కాజల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. డెలివరనీ తర్వాత తొలిసారి భర్త, బాబుతో కలిసి షికారుకి గోవా వెళ్లింది కాజల్. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
కాజల్ అగర్వాల్ కొన్ని నెలలుగా ముంబై నుంచి బయటకు అడుగు పెట్టలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 19న నీల్ కిచ్లూకు ఆమె జన్మనిచ్చారు. డెలివరీకి ముందు నుంచి ముంబై వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. డెలివరీ తర్వాత తల్లి బాధ్యతల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు కాస్త తీరిక చేసుకుని… భర్త, బిడ్డతో కలిసి టూర్ వేసింది. ప్రస్తుతం ఆమె గోవాలో ఉంది. భర్త గౌతమ్ కిచ్లూ, కుమారుడు నీల్ కిచ్లూతో పాటు సోదరి నిషా అగర్వాల్ ఫ్యామిలీతో కలిసి గోవా టూర్ వేసింది. కాజల్ అగర్వాల్ కుమారుడు నీల్ కిచ్లూకి ఫస్ట్ హాలిడే టూర్ ఇది. గోవా బీచ్లో చిన్నారి కాళ్ళు పెట్టిన ఫోటోను కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోవా టూర్ వీడియో కూడా షేర్ చేశారు.
సినిమాలకు వస్తే… ‘హే సినామికా’తో ఈ ఏడాది మార్చిలో కాజల్ అగర్వాల్ థియేటర్లలో సందడి చేశారు. హిందీ సినిమా ‘ఉమ’ షూటింగ్ కంప్లీట్ చేశారు కాజల్. మరో రెండు తమిళ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే… బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ ఏ సినిమాకు సంతకం చేశారనేది ఆసక్తిగా మారింది.