స్పెషల్ డెస్క్- ఈ ప్రపంచంలో పాత వస్తువులను సేకరించే హాబీ చాలా మందికి ఉంటుంది. వ్యక్తిగతంగానే కాకుండా కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు, మరి కొన్ని దేశాల్లో సంస్థలు పాత, అరుదైన వస్తువులను సేకరిస్తుంటాయి. ఐతే వ్యక్తిగకంగా సేకరంచే అరుదైన నాణేలు, వస్తువులను కొంత మంది తన దగ్గరే దాచుకుంటే, మరి కొంత మంది మంచి రేటుకు అమ్మేస్తుంటారు. ఇలా పత వస్తువులు కొనేవారుంటే సిరుల పంటే అనుకొండి.
ఈ మధ్య కాలంలో పాత వస్తువులను, అరుదైన వస్తువులను వేలం పాట పాడుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా వేలం వేసే సంస్థలు, వెబ్ సైట్లు ఉన్నాయి. పాత నాణేలా నుంచి మొదలు పేయిటింగ్స్, కళాకండాలు, గతంలో ప్రముఖులు వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. ఇలా వేలం వేసిన సందర్బాల్లో ఒక్కోసారి కోట్ల రూపాయల ధర పలుకుతుంటాయి.
తాజాగా ఓ అరుదైన నాణేనాన్ని వేలం వేయగా కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది కోట్ల రూపాయలకు రూపాయి నాణెం అమ్ముడైంది. అయితే ఈ రూపాయి నాణేం ఇప్పటిది కాదు. 1885లో భారత దేశంలో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణెం. ఓ వ్యక్తి దగ్గర ఈ అరుదైన రూపాయి నాణెం ఉండగా ఇటీవల జరిగిన వేలం వేశారు.
ఈ రూపాయి నాణేనాన్ని వేలంలో ఓ అంతర్జాతీయ వెబ్సైట్ ఏకంగా 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఒకే ఒక్క నాణేం అతన్ని ఒక్క రోజులో మిలియనీర్ చేసింది. గత సంవత్సరం జూన్లో కూడా 1933 నాటి అమెరికా డాలర్ నాణేం న్యూయార్క్లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లకు అమ్ముడుపోయింది. అంటే మన దేశ కరెన్సీలో 188 కోట్ల రూపాయలన్నమాట. మరి మీదగ్గర పాత నాణేలు ఏమైనా ఉన్నాయేమో వేతకండి.