టోక్యో ఒలింపిక్స్- సమయం చాలా విలువైంది. ఇది కొంత మందికి మాత్రమే తెలుసు. ఈ విశ్వంలో చాలా సంఘటనలు రెప్పపాటు కాలంలో జరిగిపోతుంటాయి. క్షణం ఆలస్యం అయినా మళ్లీ ఆ సమయాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేము. అందుకే ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది సమయం అని చెప్పకతప్పదు. ఇక ఒలింపిక్స్ లో క్షణాల విలువ ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే క్షణాల తేడాతోనే మెడల్ సాధించడమో, ఓడిపోవడమో జరుగుతుంటుంది.
అర క్షణం తేడాతో ఓ ఆటగాడు ప్రపంచ రికార్డును కోల్పోయిన ఘటన టోక్యో ఒలింపిక్స్ లో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించిన జోషువా చెప్తేగి తాజాగా అరక్షణం తేడాతో ఒలింపిక్ రికార్డును చేజార్చుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ లో 5 వేల మీటర్ల పరుగు పందెం ఫైనల్స్లో ఉగాండా అథ్లెట్ స్వర్ణపతకం సాధించాడు.
దీంతో ఈ ఘనత సాధించిన మొదటి ఉగాండా అథ్లెట్గా రికార్డులకెక్కాడు. ఈ పరుగు పందెం ఫైనల్స్లో 5 వేల మీటర్ల దూరాన్ని 12:58.15 నిమిషాల్లో ఛేదించాడు. ఈ పరుగు పందెంలో కెనడాకు చెందిన అహ్మద్ 12:58.15, అమెరికాకు చెందిన పాల్ చెలిమో 12:59.05 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక అసలు విషయం ఏంటంటే 2008 ఒలింపిక్స్లో కెనెనిసా బెకెలె ఈ దూరాన్ని 12:57.82 నిమిషాల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు.
తాజాగా టోక్యో ఒలింపిక్స్ లో జరిగిన 5వేల మీటర్ల పరుగు పందెంలో చెప్తేగి అర సెకను తేడాతో ఈ రికార్డును కోల్పోయాడు. కేవలం అర క్షణం ముందు ఈ లక్ష్యాన్ని చేరుకుని ఉంటే ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేవాడు. కానీ ఏంచేస్తాం.. మనోడికి అదృష్టం లేదు మరి.