‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’అన్న మాటకు అక్షర సత్యం సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలిపనులకు వెళుతూ పిహెచ్డి చేసిన మట్టిలో మాణిక్యమే ఈ భారతి.
‘కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు’అన్న మాటకు అక్షర సత్యం సాకే భారతి. కడు పేదరికంలో పుట్టి.. అత్తారింట్లో కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాన్ని అనుభవిస్తూ.. కూలిపనులకు వెళుతూ పిహెచ్డి చేసిన మట్టిలో మాణిక్యమే ఈ భారతి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని శింగమనల నాగుల గుడ్డం గూడానికి చెందిన భారతి.. భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుండి రసాయన శాస్త్రంలో పిహెచ్డి చేసి..గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టా తీసుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఆమె డాక్టరేట్ పొందేందుకు పడిన కష్టాన్ని, ఆమె కృషిని కథనాలుగా తెరమీదకు తెచ్చింది సుమన్ టీవీ.
సుమన్ టీవీ వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చొరవ తీసుకుని ఆమెకు తిరుపతి యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్యాకల్టీగా ఉద్యోగం ఇప్పించారు. అయితే ఆమె కథనాన్ని ప్రపంచానికి తెలియజేసిన సుమన్ టీవీని అభినందించిన ఆయన.. భారతి పట్టుదలను మెచ్చుకున్నారు. అదేవిధంగా ఆమెకు గైడెన్స్ చేసిన ఆ యూనివర్శిటీ ప్రొఫెసర్ శోభను కూడా అభినందించారు రవిబాబు. ఓ గిరిజన తండాకు చెందిన మహిళ రసాయన శాస్త్రంలో పిహెచ్ డి చేయడం మామూలు విషయం కాదన్న ఆయన.. ఆమె పది మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచిందని కొనియాడారు. ఆమె కుటుంబ నేపథ్యం చూస్తే ఎవ్వరూ చదువుకున్న వాళ్లు లేరని అన్నారు. అయితే అందరూ ఆమెకు ఆర్థిక సాయాన్ని అందిస్తారని, అది అభినందించదగ్గ అంశమని అయితే.. తాము మాత్రం ఆమె కాళ్లపై నిలబడాలన్న ఉద్దేశంతో ఉద్యోగం కోసం యూనివర్శిటీ ఛాన్సలర్తో మాట్లాడాలన్నారు.
డైరెక్టుగా అసిస్టెంట్ ఫ్రొపెసర్గా నియమించాలంటే నిబంధనలు ఒప్పుకోని కారణంగా.. అసిస్టెంట్ ఫ్యాక్టలీగా నియమించాలని కోరగా.. వైస్ ఛాన్సలర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే ఆమెకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఆమెకు చేతనైనా సాయం చేస్తామని హామీనిచ్చారు. భారతికి వైఎస్సార్ హయాంలోనే ఇళ్లు వచ్చిందని, అయితే గత ప్రభుత్వంలో వీరికి సహకారం అందించడంతో పాటు ఆర్థికమైన అండ లేకపోవడంతో ఇళ్లు కట్టుకోలేకపోయారని, ఎమ్మెల్యేను కలిసిన సమయంలో కూడా ఉద్యోగం గురించి మాట్లాడారే తప్ప, ఇంటి గురించి చెప్పలేదన్నారు. ఇల్లు గురించి చెప్పి ఉంటే జగన్ ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం కచ్చితంగా సహకరిస్తుందని హామీనిచ్చారు. ఆమెకు ఇల్లు వచ్చేవిధంగా కృషి చేస్తామన్నారు.