వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది అని సంతోషించే లోపే విషాదాంతం అయ్యింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్కు రెండు నెలల క్రితం(జనవరి 7)న అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి గుండెను సేకరించి.. ఆయనకు విజయవంతంగా అమర్చారు.
రీజనరేటివ్ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రెవివికార్ అనే కంపెనీ జన్యు మార్పిడి పందిని పేషెంట్కు డొనేట్ చేసింది. దీంతో జనవరి 7న సుమారు 8 గంటల పాటు సర్జరీ నిర్వహించిన అమెరికా వైద్యులు, డేవిడ్ బెన్నెట్కు పంది గుండెను మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. ఈ సర్జరీ విజయం కావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఇక మానవ అవయవాల కొరతను జంతువుల అవయవాల ద్వారా అధిగమించవచ్చన్న ఆశ మరోసారి చిగురించింది. దీర్ఘకాల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మంచి శుభపరిణామంగా భావించారు.
ఇది కూడా చదవండి: ఫేస్బుక్లో ‘అల్లరి పిల్ల’ వల.. నగ్నంగా కాల్స్.. ఆపై..అయితే ఆ ఆశ ఆవిరయ్యింది.. గత కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. కాగా.. బెన్నెట్ కుమారుడిని వైద్యులు అభినందించారు. మానవ అవయవ కొరతను అధిగమించే ప్రయత్నాలకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నం ఇక్కడితో ఆగకూడదని అన్నారు.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో వైరలవుతోన్న ‘గుండు’ బాస్ కథ!
1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితంగా భావించినా.. ఇప్పుడదీ విషాదమే అయ్యింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.