ఇటీవల కాలంలో కుక్కల దాడి ఘటనలో ఇద్దరు బాలులు తీవ్రంగా గాయపడి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఓ పంది బాలుడిపై దాడి చేసింది. ఈ ఘటన వీడియోలు సోసల్ మీడియాలో వైరల్ అయింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అడవి పంది కలకలం సృష్టించింది. శనివారం ఉదయం క్యూకాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటూ పరిగెత్తింది. ఇక ఈ క్రమంలో అక్కడి భక్తుల అరుపులకు భయపడిన పంది.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పై అటు ఇటు పరిగెత్తింది. ఆ పందిని పట్టుకునేందుకు ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికి వారికి చిక్కకుండా క్యూకాంప్లెక్స్ వీధుల్లో పరిగెత్తింది. వారి నుంచి తప్పించుకునే […]
వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది అని సంతోషించే లోపే విషాదాంతం అయ్యింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్కు రెండు నెలల క్రితం(జనవరి 7)న అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి గుండెను సేకరించి.. ఆయనకు విజయవంతంగా అమర్చారు. రీజనరేటివ్ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రెవివికార్ అనే కంపెనీ జన్యు మార్పిడి పందిని […]
గుంటూరు- కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టగలిగారు.. కానీ సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు ముగింపు పలికే టీకాను ఇంతవరకు ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇప్పటికి మన సమాజంలో చేతబడి, బాణామతి, క్షుద్ర పూజలు వంటి దురాచారాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అచ్చంపేట-మాదిపాడు ప్రధాన రహదారి తాళ్లచెరువు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. పూజల్లో భాగంగా పందిని […]
పెద్ద పెద్ద విపత్తులు సంభవించినప్పుడు, అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు ఈ జనాలకు హఠాత్తుగా పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుర్తొస్తారు. ఫ్రెంచి కాలజ్ఞానిగా ప్రాచుర్యం పొందిన నోస్ట్రడామస్ గుర్తొస్తారు. పాపం నాలుగైదు శతాబ్దాల కిందే చచ్చిపోయిన వారికి అర్జంటుగా ప్రాణప్రతిష్ట చేస్తారు. వీర బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానం లో ఇప్పటివరకు ఎన్నో విషయాలు నిజంగా జరిగాయి చూసారా … అని కొందరు చెప్పేస్తారు. నిజమని వీడియోలు కూడా చూపిస్తారు. జరుగుతూనే ఉన్నాయి. అది నిజం అని మనం […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ […]