జాతిపిత మహాత్మాగాంధీ అత్యున్నత పౌర పురస్కారం
శాంతి, అహింస పోరాటాలకు స్ఫూర్తి
ప్రపంచ అహింసా దినోత్సవంగా – గాంధీ జయంతి
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ!..
శాంతి, అహింసను ప్రోత్సహించినందుకు మహాత్మాగాంధీకి మరణానంతరం ప్రతిష్టాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేయాలని న్యూయార్క్ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మాలోని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ను అమెరికా అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు. ప్రతిష్ఠాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను గాంధీకి ఇస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
గాంధీ నడిపిన ఉద్యమాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని, ఎంతో మందిని ప్రభావితం చేశాయని అమెరికా ప్రతినిధుల సభ కొనియాడింది. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ నుంచి నెల్సన్ మండేలా వరకూ గాంధీని ఆదర్శంగా తీసుకునే తమ హక్కుల కోసం పోరాడరని ఈ సందర్భంగా గుర్తు చేసింది.ఈ తీర్మానం అమెరికా కాంగ్రెస్లో ఆమోదం పొందడంతో గాంధీజీకి అవార్డు ప్రదానం చేస్తే – అమెరికా కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అందుకున్న తొలి భారతీయుడిగా, మరణానంతరం పురస్కారం అందుకున్న ‘మొదటి వ్యక్తి’గా గుర్తింపు పొందుతారు.
ఇప్పటి వరకూ ఈ అవార్డును అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా, మదర్ థెరిసా, రోసా పార్క్స్ వంటి గొప్ప వ్యక్తులు ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు.