దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన వనౌతులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రత నమోదయ్యింది. భూకంపం తీవ్రత కారణంగా సునామీ వచ్చే అవకాశమున్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర ప్రాంతాలను సముద్ర అలలు ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన ఈ వనౌతు.. 80 దీవుల సమూహం. ఇది 1,300 కిలోమీటర్లు విస్తరించి ఉంది. పగడపు దిబ్బలతో ఏర్పడిన ఈ ద్వీప దేశం పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. నీటి అడుగున గుహలు, ప్రదేశాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. వనౌతూలోని సన్మా ప్రావిన్స్లోని పోర్ట్-ఓల్రీ, లుగాన్విల్లే సమీపంలో ఆగస్టు 18న రాత్రి 9.10 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 91 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపారు. భూకంప కేంద్రం పోర్ట్-ఓల్రీకి 20 కిలోమీటర్ల దూరంలో, లూగాన్విల్లేకి 71 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.