ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, లక్నో, హర్యానా, ఉత్తరాఖండ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం కారణంగా భారత్ సహా పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్ లో సైతం భూప్రకంపనలు ఏర్పడ్డాయి.
ఢిల్లీలో భూకంపం సంభవించింది. భయంలో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. ఢిల్లీ సహా జమ్మూ కశ్మీర్, లక్నో, పంచకుల, ఉత్తరాఖండ్, ఛండీగఢ్, హర్యానా, పంబాజ్ రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కేంద్రం ఆఫ్గనిస్తాన్ లో గుర్తించినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.6గా నమోదుదైంది. అటు పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్ లో సైతం భూకంపం వచ్చింది. భారత్ లోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చిన వీడియోలు వైరల్ గా మారాయి.
భారత్ సహా పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్ వంటి దేశాల్లో భూకంపం సంభవించింది. భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూప్రకంపనలు ఏర్పడ్డాయి. దాదాపు 45 సెకండ్లపాటు భూమి కంపించింది. ఇళ్లలోని ఫర్నీచర్, లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఒక్కసారిగా కదలడం ప్రారంభం అయ్యాయి. అది చూసి ప్రజలు అంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్ లోని కలాఫ్గన్ కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల పాకిస్తాన్- ఆఫ్గనిస్తాన్ లో 9 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని స్వాట్ వ్యాలీ రీజియన్ లో 100 మంది వరకు ఆస్పత్రుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు.
6.8 Magnitude Earthquake hits Afghanistan, Tremors felt in #India
People came out of their homes in fear.#भूकंप #earthquake pic.twitter.com/Yqmkbyjrug— Chaudhary Parvez (@ChaudharyParvez) March 21, 2023
ఇటీవల సిరియా- టర్కీ భూకంపాన్ని చూసిన తర్వాత ఆ పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోయే పరిస్థితి ఉంది. ఆ భూకంపం వల్ల వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే భారతదేశంలో ఇటీవలి కాలంలో భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో గుజరాత్ లో భూకంపం రాగా.. తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదైంది. అలాగే ఫిబ్రవరి 22న ఢిల్లీ, చెన్నై ప్రాంతాల్లో ఒకేసారి భూమి కంపించింది. అప్పుడు రిక్టరు స్కేల్ పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. అయితే ఇటీవలి భూమి కంపించిన సందర్భాల్లో మన దేశంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
A magnitude 6.5 earthquake has been felt across much of Afghanistan, Pakistan and parts of India.
At least 3 people have been killed – two in Afghanistan and one in Pakistan according to police and officials ⤵️
🔴 LIVE coverage: https://t.co/j6JZqNM4dv pic.twitter.com/gQ7e0T0Q5z
— Al Jazeera English (@AJEnglish) March 21, 2023
FLASH: A 6.8 magnitude earthquake has hit parts of Pakistan, India, and Afghanistan. This just confirms my School Boy’s Theory of History: it’s just one damn thing after another. Take a look:pic.twitter.com/Q30f9faCFY
— Steve Hanke (@steve_hanke) March 21, 2023
A powerful 6.5 magnitude earthquake earlier today hit Afghanistan, Pakistan, India and Central Asia with it’s epicenter in North Eastern Afghanistan. Already deaths are being reported with many homes and buildings collapsed. pic.twitter.com/T9AjEZYxCG
— muslim daily (@muslimdaily_) March 21, 2023