ఎపిలో పలు చోట్ల భూమి కంపించింది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో భూ కంపం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో స్వల్ప భూకంపం ఏర్పడింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పల్నాడు అచ్చం పేట మండలంలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లిలో భూమి స్వల్పంగా కపించింది. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీర్ల పాడు మండలాల్లో భూకంపం ఏర్పడింది. ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామ వాసులు.. ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు పెట్టారు. అటు పులించింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం ఏర్పడిన సంగతి విదితమే. ఈ వార్తలపై ఆ దేశ ప్రజలేకాకుండా ఇతరులు సైతం కలచి వేసింది. కలవర పాటుకు గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటికే సుమారు 40 వేల మంది చనిపోయారు. ఇటీవల కాలంలో జరిగిన ప్రకృతి అతి పెద్దదిగా చెబుతున్న ఈ భూకంపం ధాటికి ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. భూమి కంపింస్తుందంటే చాలు.. ఈ భయానక దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. వరుసగా భూకంప ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ ప్రకృత్తి విపత్తుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.