ఈ మద్య ఆకాశమార్గాన పయణించే విమానాలకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే పైలెట్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
ఇటీవల పలు దేశాల్లో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మద్య నేపాల్ లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 72 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సాధారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అయితే పైలెట్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు రక్షించబడుతున్నాయి. తాజాగా నేపాల్ లో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
శ్రీ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం నేపాల్ లోని బైరహవాకు వెళ్తుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడి ఇంజన్ లో మంటలు చెలరేగడంతో పైలట్ అలర్ట్ అయి వెంటనే ఆ విమానాన్ని ఖాట్మాండుకు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు శ్రీ ఎయిర్ లైన్స్ ప్రతినిధి అనిల్ మనంధర్ చప్పారు. ఈ విమానంలో 78 మంది ప్రయాణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖాట్మాండ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారని ఈ సందర్భంగా నేపాల్ పౌర విమానయాన అథారిటి ప్రతినిథి జగన్నాథ్ తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘విమానం ల్యాండ్ అయినపుడు ఎలాంటి అగ్ని ప్రమాదం లాంటిది సంభవించిన సూచనలు లేవు ’ అని అన్నారు. అలాగే మౌంట్ ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని 14 ఎత్తైన శిఖరాలను ఎనిమిది పర్వతాలకు నెపాల్ నిలయంగా ఉందని.. ఇక్కడ తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని.. వాటిలో విమానం ఆకాశ మార్గంలో ఉన్నపుడు వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు రావడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. జనవరిలో ఖాట్మండ్ నుంచి పొకారాకు వెళ్తున్న విమానం అనూహ్యంగా క్రాష్ అయి 72 మంది చనిపోయారని అన్నారు.
Plane In Nepal Makes Emergency Landing After Indication Of Fire In Engine https://t.co/d4KXBDwykE pic.twitter.com/QtITMcu7Nv
— NDTV News feed (@ndtvfeed) March 9, 2023