భూమి మీద స్పేస్ లేదు. ఇక అంతరిక్షంలోకే కాలనీలు. అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉంది. జీవాన్వేషణే లక్ష్యంగా అంగారకుడిపైకి నాసా పంపిన పర్సివరెన్స్ రోవర్ శోధన కొనసాగుతుంది. మిషన్లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. జెజెరో క్రేటర్లోని ఓ పురాతన రాతిపై అనుకున్నట్లుగానే గుంత చేసిన రోవర్ రాతి నమూనాలను సేకరించడంలో మాత్రం విఫలమైంది. ఇలా అంగారకుడిపై గుంత చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అనుకున్నట్లుగానే అన్ని పరికరాలు సక్రమంగా పనిచేశాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు విజయం సాధించామన్నారు. ఈసారి కూడా తదుపరి ప్రయత్నాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మార్స్పై జీవజాలం ఉందా? లేదా ? అని తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఫలితాలు విశ్లేషించేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అంతా బాగుంటే మనుషులు జీవించడానికి ఓకే అని చెప్పడమే ఆలస్యం. వెంటనే మనుషులను తరలించడానికి మస్క్ టీమ్ ను రెడీ చేసింది నాసా. అక్కడ కాలనీలు నిర్మించడానికి అబీబో టీమ్ రెడీగా ఉంది. ప్రధానంగా అంగారక గ్రహంపై మానవ నివాసం సాధ్యమవు తుందా లేదా అనేదే ప్రధాన ప్రశ్న.
ఈ క్రమంలోనే అంగారక వాతావరణంలో మనిషి జీవించగలరా లేదా అనే ఆలోచన అందరిలోనూ ఉంది. అయితే ప్రస్తుతం భూమిపైనే అంగారక గ్రహ వాతావరణాన్ని తయారు చేస్తోంది నాసా. ఇందులో భాగస్వాములు కావడం కోసం ప్రత్యేకంగా ప్రజల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. కృత్రిమ వాతావరణంలో నివశించేందుకుగాను ఔత్సాహికుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
హ్యూస్టన్లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రంలోని ఓ ప్రదేశంలో మార్స్ డ్యూన్ ఆల్ఫా అనే ప్రత్యేకమైన ఆవాసం ఏర్పాటు చేసింది. మార్స్ కాలనీలో నివాసానికి ఒక్కొక్కరికీ ఎంత ఖర్చవుతుంది? అక్కడికి చేరుకోవడం ఎలా? ఎదురయ్యే ఇంజినీరింగ్ సవాళ్లు ఎలాంటివి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వంటి అనేక అంశాలను ఇందులో చర్చించారు. 1700 చదరపు విస్తీర్ణంలో ఈ కృత్రిమ మార్స్ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది.
ఈ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత వారి శరీరంలో వచ్చే మార్పులను సమస్యలను ముందుగానే తెలుసుకోవాలని నాసా నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం కేవలం అమెరికాలో శాశ్వత నివాసం ఉంటున్న వారికి మాత్రమే అని నాసా వెల్లడించింది. .