పూర్వ కాలంలో ఏదైనా సమాచారం పంపాలంటే పావురాలను పంపించేవారు. ఆ తర్వాత ఉత్తరాల వ్యవస్థ వచ్చింది. ఏ సంప్రదింపులైనా సరే ఉత్తరాల ద్వారా పంచుకునేవారు. అయితే కొన్నిసార్లు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఘనకార్యాల వల్ల ఉత్తరాలు చేరాల్సిన చోటికి సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ పనైనా క్షణాల్లో జరిగిపోతున్నాయి. ముఖ్యంగా సమాచార వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందింది. పూర్వ కాలంలో తమ వారికి ఏదైనా సందేశం పంపాలంటే పావురాలు, వేగుల తో పంపించేవారు. ఆ తర్వాత ఉత్తరాల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఒక లేక ఎవరికైనా చేరాలంటే దూరాన్ని బట్టి రోజులు పట్టేది. ఉత్తరాలు చేరవేసే కీలక బాధ్యత పోస్టల్ డిపార్ట్ మెంట్ నిర్వహించేది. అప్పట్లో ఈ పోస్టల్ డిపార్ట్ మెంట్ పై ఎన్నో సెటైర్లు ఉండేవి.. పెళ్లికి శుభలేక పంపిస్తే.. ఆ జంటకు పిల్లలు పుట్టి బారసాలకు అందేవని అని అనేవారు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పోస్టల్ డిపార్ట్ మెంట్ పుణ్యమా అని ఓ లేటర్ 100 ఏళ్లకు అందింది. అయితే ఆ లేఖ అందుకోవాల్సిన వారు చనిపోయాడు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
టెక్నాలజీ అభివృద్ది అవుతున్నా కొద్ది మనిషికి ఎన్నో అవసరాలు చిటికలే సమకూరుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం తన గుప్పిట్లో దాచుకున్నట్టే అంటారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సమాచార వ్యవస్థ చాలా సులభతరం అయ్యింది. ఒకప్పుడు ఏ సంప్రదింపులైనా సరే ఉత్తరాల ద్వారా పంచుకునేవారు. వ్యక్తుల మద్య సంబంధాలు కొనసాగించడానికి ఉత్తరాల వ్యవస్థ కీలకంగా ఉండేది. కాకపోతే కొన్నిసార్లు పోస్టల్ డిపార్ట్ మెంట్ చేసే తప్పిదాల వల్ల లెటర్స్ చేరడానికి చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు తాము పంపించిన లేఖలు ఏళ్లు గడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనే లండన్ లో చోటు చేసుకుంది. లేటర్ పంపిన 100 ఏళ్ళ తర్వాత చేరాల్సిన చోటుకు చేరుకుంది.
మొదటి ప్రపంచ యుద్దం జరుగుతున్న సమయంలో అంటే 1916 లో క్రిస్టాబెల్ మన్నేల్ అనే ఓ మహిళ తన స్నేహితుడు అయిన కేటీ మార్ష్ కి ఒక లేఖ పోస్ట్ చేసింది. ఆ లేఖ అసలు వ్యక్తికి చేరడానికి ఏకంగా 100 సంవత్సరాలు పట్టింది. వందేళ్ల తర్వాత క్రిస్టాబెల్ మన్నేల్ రాసిన లెటర్ 2021 లో లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద ఉన్న లెటర్ బాక్స్ లో కనిపించింది. రాయల్ మెయిల్ సిబ్బంది ఈ లేఖను వందేళ్ల తర్వాత డెలివరీ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈ లేఖ అందుకోవాల్సిన సదరు వ్యక్తి ఈ భూమిపై లేరు.. చనిపోయారు. కాగా, సంబంధిత ఫ్లాట్ లో ఉన్న ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ లేఖను కొంత కాలం తన వద్ద ఉంచుకొని చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు. అయితే లెటర్ ఎందుకు అంత ఆలస్యం అన్న ప్రశ్నపై రాయల్ మెయిల్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని అంటున్నారు. బహుషా ఆ సమయంలో అది ఎక్కడో తప్పిపోయి తర్వాత వీరి చేతికి రావడంతో దాన్ని జాగ్రత్తగా డెలివరీ చేసి ఉండొచ్చిన భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ లేటర్ కి సంబందించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Letter arrives more than 100 years late https://t.co/BBsPcl31Pu
— BBC News (UK) (@BBCNews) February 16, 2023