గత కొంతకాలంగా ఐర్లాండ్ లో జనాభా తగ్గిపోతుంది. అక్కడి దీవుల సముదాయంలో కొన్ని దీవుల్లో 160 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఐర్లాండ్ ప్రభుత్వం మళ్లీ జనసంఖ్య పెంచాలనే ఉద్దేశ్యంతో ఓ వినూత్న ఆఫర్ ప్రకటించింది.
విదేశాల్లో స్థిరపడాలని కోరుకునే వారికి యూరప్ కంట్రీ గుడ్న్యూస్ చెప్పింది. ఇతర దేశాలకు వెళ్లాలని ఉండడం వరకు సరే.. కానీ చాలా వరకు ఖర్చు అవుతుందని కొందరు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. ఇకపై ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిన పనిలేదు. యూరప్ దేశానికి వెళ్లితే చాలు.. అక్కడి ప్రభుత్వం మీకు సకల సదుపాయాలతో సహా రూ. 71 లక్షలు మీ చేతుల్లో పెడుతుంది. కావలసిన సహకారాన్ని అందిస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం..
విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి యూరప్ దేశం బంపరాఫర్ ఇచ్చింది. సాధారణంగా మనం ఇతర దేశాలకు వెళితే మనకు చాలా డబ్బు ఖర్చవుతుంది. కానీ యూరప్ వెళ్తే చాలు ఎంచక్కా వాళ్లే మీకు లక్షల రూపాలయలు ఇచ్చి స్వాగతం పలుకుతారు. నిజమేనండీ! తమ దేశానికి వచ్చి స్థిరపడిన వారికి రూ. 71 లక్షలు తామే ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే గత కొంతకాలంగా అక్కడి జనాభా తగ్గిపోతోంది. ఈ సమస్యలను అధిగమించుటకు ఐర్లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడికి వెళ్లిన తర్వాత రిలోకేషన్ డబ్బులు ఇచ్చి.. ఉద్యోగం కూడా చూసి పెడతారట. స్టార్టప్ పెట్టాలని అనుకుంటే కూడా పెట్టుబడి పెట్టి పూర్తి సహకారం అందిస్తారు. ఐర్లాండ్ ప్రభుత్వం ఈ ఆఫర్ పెట్టిందంటే అక్కడి జనాభా ఎంతలా తగ్గిపోతుందో ఆలోచించండి. ఐర్లాండ్లోని 90 దీవుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అయితే ఐర్లాండ్ ప్రభుత్వం ఎందుకీ నిర్ణయం తీసుకుందంటే..జనాభా తగ్గిపోతుండడంతో అక్కడి ద్వీపాల్లో పాడుపడిన,శిథిలమైన ఆస్తులు, శిథిలమైన కట్టడాలు పెరిగిపోతున్నాయి. వాటిని పునరుద్దరించే ఉద్దేశంతో ఈ స్కీమ్ వచ్చింది. జనాభా తగ్గుతుండడంతో టెక్నాలజీ, ఫైనాన్స్, మెడికల్ ఇండస్ట్రీ.. ఇలా వివిధ రంగాల్లో నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఈ కొరత పూరించేందుకు ఆయా విభాగాల్లో నిపుణులను తమ దేశంలో స్థిరపడేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ పాలసీతో ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. పాలసీలో ఎంపికైన వారికి సంవత్సరానికి 20 వేల యూరోలు, 5 సంవత్సరాల వరకు ట్యాక్స్ క్రెడిట్ కూడా ఆఫర్ చేస్తుంది ఐర్లాండ్ ప్రభుత్వం.
ఇకపోతే ఓ కండీషన్ కూడా ఉంది. ఐర్లాండ్ దేశంలో సెటిల్ అయ్యేందుకు అక్కడ నివాసమేర్పరచుకోవాలి. అందుకు గాను నివాసాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రాపర్టీ 1993 కంటె ముందు నిర్మించినదై ఉండాలి. అది రెండేళ్లపాటు ఖాళీగా ఉండాలి. అలాంటి ఖాళీగా ఉన్న నివాససాన్ని కొనుగోలు చేసి అందులో నివాసమున్నవారికి రూ. 71 లక్షలు ఇస్తారు. వీరు ఇచ్చిన రూ. 71 లక్షలు ప్రాపర్టీ మెయింటేనెన్స్, పునర్నిర్మాణానికే ఉపయోగించాలి. ఈ ఆఫర్ నచ్చిన వారు జూలై 1వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చని ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.