ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి రజతం సాధించడంతో యావత్ భారతావని సంబరాలు చేసుకుంది. పతకం నెగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి విలేకరులతో మీరా మాట్లాడింది. ముందుగా ఇంటికెళ్లి అమ్మానాన్నలను కలుసుకోవడంతోపాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే, నోరూరించే పిజ్జా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు చెప్పడం ఎక్కవగా ఆకర్షించింది. ‘ముందుగా వెళ్లి పిజ్జాను లాగించేస్తా. తిని ఎన్నో రోజులైంది. ఆరోజు చాలా తింటా’ అని చాను చెప్పింది. పిజ్జా కోసం తహతహలాడి పోతున్నానని చాను చెప్పిన వెంటనే.. డామినోస్ స్పందించింది. మీరాకు శుభాకాంక్షలు చెబుతూనే అందజేయనున్నట్టు ప్రకటించింది.
టోక్యో ఒలంపిక్స్లో భారత క్రీడాకారులు అనుకున్నదానికంటే మెరుగ్గా రాణిస్తున్నారు. ఇప్పటికే మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించగా, రెజ్లింగ్ కేటగిరిలో ప్రియాంక మాలిక్ స్వర్ణం సాధించారు. ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ప్రారంభించింది. అయితే ఈ టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా భారత క్రీడాకారులు అందరూ కూడా పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే పథకం సాధించి ఉత్సాహాన్ని నింపింది మీరాబాయి .
మహిళల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో 49 కిలోల విభాగంలో మీరాబాయి చాను ఏకంగా రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. దీంతో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన మొట్టమొదటి మహిళగా మీరాబాయి చాను భారత చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది . ప్రస్తుతం మీరాబాయి చాను పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది.
భారత ప్రజలందరి గర్వంగా భావించే విధంగా ప్రతిభ చాటారు అంటూ మీరాబాయి చాను పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2000 సంవత్సరంలో కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత ఎవరూ కూడా ఒలంపిక్స్ లో ఇప్పటివరకు పథకాన్ని సాధించలేదు.