కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లపాటు లాక్డౌన్లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కరోనా వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యింది.
చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. తీవ్రమైన ఆర్థిక, ప్రాణ నష్టాన్ని కలిగింది. రెండేళ్లలో మనిషి జీవితాన్ని పూర్తిగా అతలాకులం చేసింది.. చావు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో.. చావు నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చూపించింది. కళ్లముందే ఐనవాళ్లు పోయినా కనీసం చూడటానికి, పలకరించడానికి వీలు లేని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరికీ ‘మాస్క’ ప్రాధాన్యత ఎంతో పెరిగిపోయింది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు మాస్క్ వాడకాన్ని తప్పనిసరి చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ కి ఎంతో విలువ పెరిగింది. మాస్క్ విలువ ఎంతగొప్పదో అన్న విషయం ఓ యువతి ప్రపంచ దిగ్గజ వ్యాపార వేత్తకు తెలిసేలా చేసింది.. అతడు ఆఫర్ చేసి రూ.82 లక్షలు సైతం తృణప్రాయంగా తీసేసింది. పూర్తి వివరాల్లోకి వెలితే..
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. మనుషులు పిట్టల్లా రాలిపోయారు.. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యింది. దాదాపు రెండేళ్ల పాటు లాక్ డౌన్ లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పని సరి అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ప్రతి ఒక్కరికీ మాస్క్ శ్రీరామ రక్ష గా మారిందంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కరోనా బూస్టర్ డోస్ లు వచ్చాయి.. పరిస్థితులు మెల్ల మెల్లగా చక్కదిద్దుకుంటున్నాయి. అయినా కరోనా భయం మాత్రం పోలేదు. ఇప్పటికీ మాస్క్ ధరించేవారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా మాస్క్ తీస్తే పెద్ద ఇబ్బంది ఏముందని భావించే వారు ఉన్నారు.. కానీ ఓ యువతి మాత్రం తనకు ఏకంగా రూ.82 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసినా మాస్క్ ఎట్టి పరిస్థితిలో తీసే ప్రసక్తి లేదని ఆఫర్ రిజక్ట్ చేసింది.
ఈ విషయం వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఓ అమెరికన్ పారిశ్రామిక వేత్త, టెక్ దిగ్గజం అయిన స్టీవ్ కిర్చ్ చెప్పిన నిజం. తాను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్కన ఓ ప్రయాణికురాలు మాస్క్ పెట్టుకోవడం గమనించి అది ఒక్కసారి తీయాల్సిందిగా కోరాడు. దానికి ఆ యువతి నో అని చెప్పింది.. మరి డబ్బులు ఇస్తాను తీస్తావా అన్నాడు.. అప్పటికీ నో అని చెప్పింది. ఇక పంతానికి వచ్చిన స్టీవ్ కిర్చ్ మాస్క్ తీస్తే ఏకంగా రూ.82 లక్షలు ఇస్తానని ఆఫర్ చేశాడట. అయినా కూడా తాను మాత్రం మాస్క్ తీసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిందట. దాంతో స్టీవ్ షాక్ అయ్యాడు.. రూ.82 లక్షల ఆఫర్ ఇచ్చినా ఆ యువతి మాస్క్ తీయలేదంటే ప్రస్తుతం ప్రపంచంలో మాస్క్ విలు డబ్బుకన్నా గొప్పదైందని స్టీవ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
‘నేను డెల్టా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో నా పక్కన ఓ యువతి కూర్చుంది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించడం చూశాను.. కరోనా ప్రభావం తగ్గిపోయింది.. ఇక మాస్క్ అవసరం ఏముంది.. దాన్ని తీసేయండీ అని అడిగాను.. కానీ ఆమె అందుకు నిరాకరించింది. ఎలాగైనా ఆమెను మాస్క్ తీసేలా ఒప్పించాలన్న ఉద్దేశ్యంతో ఆమెకు ఆఫర్లు ఇవ్వడం మొదలు పెట్టాను.. మొదట 100 డాలర్లతో మొదలు పెట్టాను. కానీ ఆమె మాత్రం మాస్క్ తీసేందుకు నిరాకరించింది. చివరికి రూ.82 లక్షల ఆఫర్ ఇచ్చాను.. అయినా కూడా తాను మాస్క్ తీయడానికి ఒప్పుకోలేదు.. కాకపోతే భోజనం చేసే సమయానికి మాస్క్ తీసింది’ అంటూ ట్విట్టర్ లో తన అనుభవాన్ని పంచుకున్నాడు స్టీవ్. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.
I am on board a Delta flight right now. The person sitting next to me in first class refused $100,000 to remove her mask for the entire flight. No joke. This was after I explained they don’t work. She works for a pharma company. pic.twitter.com/Q8Hwzhkmxf
— Steve Kirsch (@stkirsch) March 10, 2023