సాధారణంగా గొడవలు, తగాదాలు అంటే.. వెంటనే అబ్బాయిలు గుర్తుకు వస్తారు. అబ్బాయిలు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకుచచ్చే సంఘటనలు బోలేడు చూశాం. అయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ఇలా స్ట్రీట్ ఫైట్కు దిగుతున్నారు. సంస్కారం, సభ్యత మర్చిపోయి.. నడి రోడ్డు మీద చితకబాదుకుంటున్నారు. వీరిని అడ్డుకోవాల్సింది పోయి.. చోద్యం చూస్తున్నారు చుట్టుపక్కల వాళ్లు. పైగా వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తమ మీద చాడీలు చెప్తుందనే ఉద్దేశంతో తోటీ స్నేహితురాలిపై విచక్షణారహితంగా దాడి చేశారు కొందరు యువతులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్ ఇండోర్ ద్వారకాపూరి పోలీస్స్టేషన్ పరిధిలో తాజాగా ఈ షాకింగ్ ఘటన జరిగింది. నందినీ యాదవ్ అనే అమ్మాయి డోమినోస్ డెలివరీ గర్ల్గా పని చేస్తోంది. శనివారం విధుల కోసం వెళ్తున్న ఆమెను నలుగురు అమ్మాయిలు అడ్డగించి.. వాగ్వాదానికి దిగారు. అనంతరం నందినిపై ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్లు ప్రశ్నించడంతో.. తమపై నందిని.. అబద్ధాలు, చాడీలు చెప్తోందని తెలిపారు. అందుకే నందినికి ఇలా బుద్ధి చెప్తున్నామని వెల్లడించారు. ఇక నందినిపై విచక్షణారహితంగా దాడి చేశారు. నేల మీద పడేసి.. కర్రలతో విపరీతంగా కొట్టారు.
వాళ్ల కోపాన్ని చూసి.. స్థానికులెవరూ అడ్డగించే ప్రయత్నమూ చేయలేదు. దీంతో మరింత రెచ్చిపోయి నందినీని కర్రలతోనూ చితకబాదారు. అయితే దారినపోయే కొందరు మాత్రం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వాళ్లంతా స్నేహితులే అని, ప్రధాన నిందితురాలు పింకీ కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH…#Indore में #Dominos की एक महिला कर्मचारी को 4 लड़कियों की गैंग ने बेरहमी से पीटा है। इसका वीडियो सोशल मीडिया पर वायरल है। #MadhyaPradesh pic.twitter.com/yBBuCLbcBW
— rajeshkumarojha (@rajeshrepoter) June 14, 2022