ఓ మనిషి కంటి నుంచి 20 బతికున్న పురుగులను వైద్యులు వెలికితీశారు. 60 ఏండ్ల రోగి వాన్గా తన కంటి నుంచి మంట నీరు కారుతోంది అని వైద్యుల దగ్గరకు వెళ్లాడు, అయితే అతనికి కంటి చూపు బాగానే ఉంది కాని మంట విపరీతంగా వస్తోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని సుజౌ నగరానికి చెందిన వాన్ కంటి మంట నానాటికి పెరుగడంతో సుజౌ మునిసిపల్ ఆస్పత్రికి వెళ్లాడు డాక్టర్ పరీక్ష చేశాడు, అతని కుడి కనురెప్ప కింద చిక్కుకున్న చిన్న పురుగుల సమూహాన్ని గుర్తించారు.
రోగి కనురెప్ప నుంచి రెగ్లీ పురుగులను బయటకు తీసి ఓ కంటైనర్లో ఉంచాడు. 20 తెల్ల సన్నని బతికున్న పురుగులను బయటకు తీశారు. అయితే ఇవి ఎలా వెళతాయి అంటే మనం పెంచుకునే జంతువుల వల్ల ఇవి మన శరీరంలోకి వెళతాయి. కుక్కలు, పిల్లులు, ఇతర జంతువుల కండ్లకలక, కన్నీటి నాళాలలో నివసించే పరాన్నజీవులు. లార్వా పురుగులుగా అభివృద్ధి చెందుతాయి.
కుక్కలు, పిల్లులు వాన్ – ఏమీ పెంచుకోవడం లేదు. మరి ఇవి ఎలా వచ్చాయి అనేది అర్దం కావడం లేదు అతనికి. అతను గడ్డి దగ్గర వ్యాయామం చేస్తాడు. అక్కడ సోకి ఉంటాయి అని భావిస్తున్నారు.