ఈ మద్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగ కనిపించేవారు.. అకస్మాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు కన్నుమూస్తున్నారు. చిన్నా పెద్ద అనే వయసు తేడా లేకుండా గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. తాజాగా 16వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన వైద్యుడు గుండెపోటుతో కన్నుమూయడంతో అటు వైద్య సిబ్బంది.. ఇటు కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ మద్య కాలంలో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. చిన్న పెద్ద అనే వయసు తో సంబంధం లేకుండా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. తాజాగా 16000 మందికి గుండె ఆపరేషన్లు చేసి ది బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు గుజరాత్ జామ్ నగర్ కి చెందిన ఫేమస్ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ(40). ఆయన సర్వీస్ లో ఎంతోమందికి గుండె సంబంధింత ఆపరేషన్లు చేసి సక్సెస్ ఫుల్ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి క్రిటికల్ పొజీషన్ లో ఉన్న పేషెంట్ అయినా సరే ఆయన చేయి పడితే బతికి బయటపడేవారని అంటున్నారు సహ వైద్యులు.
డాక్టర్ గౌరవ్ గాంధీకి నిన్న అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపు కన్నుమూశారు. డాక్టర్ గౌరవ్ గుండెపోటుతో మరణించడం అందరి హృదయాలను కలచివేసింది. దీంతో కుటుంబ సభ్యులే కాదు.. వైద్య సిబ్బంది సైతం కన్నీరు మున్నీరయ్యారు. గౌరవ్ గాంధీ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని.. గుండెపోటు మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారని అంటున్నారు. ఎంతోమందికి గుండె సంబంధిత వైద్య చేసి బతికించిన ఆయన గుండెపోటు నుంచి తప్పించుకోలేకపోయారని సహ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.