కొన్ని సార్లు మనుషులు చావు అంచుల్లోకి వెళ్లి అదృష్టం కొద్ది బతికి బయట పడతారు. అలాంటి వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నాయని అంటుంటారు. కొంత మంది ఆకతాయిలు చేసే పనుల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఫ్లాట్ ఫామ్ పై ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న మహిళను అగంతకుడు ఒక్కసారే పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది.
వివరాల్లోకి వెళితే.. బ్రస్సెల్స్ (బెల్జియం) లోని రోగిర్ మెట్రో స్టేషన్ లో నడి వయసు మహిళ మెట్రో రైలు కోసం వేచి చూస్తోంది. కొద్ది సెకన్లలో మెట్రో రైలు వచ్చి ప్లాట్ ఫామ్ పై ఆగితే వెళ్లిపోదామనుకునే లోపు ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి ఆమెను పట్టాలపైకి తోసేశాడు. అందరూ ఆమె చనిపోతుందని డిసైడ్ అయ్యారు. రైలు పట్టాలపైన పడిపోయిన మహిళను మెట్రో డ్రైవర్ వెంటనే గమనించి అత్యవసర బ్రేక్ సాయంతో నిలిపివేశాడు. ప్లాట్ ఫామ్ పై ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది చదవండి : పెయింటర్ ను వరించిన అదృష్టం. లాటరీలో రూ.12 కోట్ల జాక్పాట్
అదృష్టం ఏంటంటే.. మహిళ ప్రాణాలతో బయటపడడమే కాదు.. పెద్దగా గాయాలు కూడా కాలేదు. ఆమె మందంపాటి ఉన్నిస్వెటర్ వేసుకోవడం, పడిన తీరు ఆమెను కాపాడింది. ఏది ఏమైనా ట్రైన్ డ్రైవర్ సమయస్ఫూర్తికి అందరూ మెచ్చుకున్నారు. స్టేషన్ రక్షణ సిబ్బంది మెట్రో పైలట్ ను, మహిళను హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స చేసి వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే మహిళను నెట్టివేసిన ఆ అగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అలా చేశాడు అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. తడి మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ ను నియమించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.