ఈ రోజుల్లో ముక్కుమొహం తెలియకుండానే ఫేస్బుక్లో పరిచయాలు పెంచుకుని చాలా మంది మోసపోతున్నారు. వారు మోసపోయామని తెలుసుకునే సరికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఆతర్వాత ఎంత మొత్తుకున్నా ప్రయోజంనం లేకుండా పోతుంది.
ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని మోసాలకు తెగపడుతున్నారు. కొంతమంది ఫేస్బుక్ ద్వారా స్నేహాలు చేసి ప్రేమగా మారి పెళ్లిచేసునేసమయానికి వారికి ముఖం చాటేసి మోసానికి పాల్పడుతున్నారు. వారు మోసపోయామని తెలుసుకునే పాటికి చాలా నష్టం జరిగిపోతుంది. తర్వాత పోలీసులను ఆశ్రయించినా కూడా ఫలితం లేకుండా పోతుంది. కొన్ని విషయాలలో చాలా చురుకుగా ఉన్నా.. ప్రేమ విషయంలో మాత్రం చాలామంది మోసపోతూనే ఉన్నారు. అలాగే బీహార్ యువకుడి మాయ మాటలు నమ్మి మన దేశానికి వచ్చిన విదేశీ యువతులు పడ్డ అవస్థల గురించి తెలుసుకుందాం. అసలు వివరాల్లోకి వెళితే..
ఉజ్జెకిస్తాన్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఫేస్బుక్ ద్వారా ఓ యువకుడి మాటలు నమ్మి భారత్ వచ్చారు. భారత్లో బీహార్కు చెందిన యువకుడు మాయ మాటలు చెప్పి వారిని ఇండియాకు రప్పించాడు. ముగ్గురు యువతులను వ్యభిచార కూపంలోకి దింపాలని ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యువతులు పోలీసుల వద్దకు చేరారు. బాధిత యువతుల అక్క ఉజ్జెకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చింది. ఎలాగైనా సరే తన చెల్లెళ్లను వెంట తీసుకెళ్లాలని అధికారులతో సకల ప్రయత్నాలు చేస్తుంది. అధికారలు తెలిపిన వివరాల ప్రకారం..
ఉజ్జెకిస్తాన్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు భారత్కు వచ్చారు. వారు బీహార్కు చెందిన యువకుని మాటలు నమ్మి, వీసా లేకుండా నేపాల్ గుండా అక్రమంగా ఇండియాకు వచ్చారు. భారత్లో యువకుడిని కలుసుకున్నారు. తర్వాత వారిని వ్యభిచారంలోకి దించాలని యువకుడు ప్రయత్నించాడు. ఆ క్రమంలో 2022 అక్టోబర్ 27న సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) పోలీసులకు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు చిక్కారు. బీహార్ పోలీసులు ఆ యువతులపై అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరారియా కోర్టు విచారణ అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిని తమ దేశమైన ఉజ్జెకిస్థాన్ పంపేందుకు అనుమతినిచ్చింది. అయితే భారత్, ఉజ్జెకిస్తాన్ దేశాల మధ్య న్యాయపరమైన సమస్యలతో యువతులు ఇక్కడే ఉండిపోయారు. గత పది నెలలనుండి వైశాలిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటున్నారు.
కాగా యువతుల కోసం వారి కుటుంబసభ్యులు వెతికే క్రమంలో వారు భారత్లో ఉన్నారన్న సమాచారం తెలిసింది. దీంతో యువతుల అక్క.. తన చెల్లెళ్లను తమ దేశానికి తీసుకెళ్లేందుకు ఇండియాకు వచ్చింది. వారిని కలిసేందుకు మొదట అధికారులు అనుమతి ఇవ్వలేదని, చాలా బతిమాలుకున్న తర్వాత చూసేందుకు అనుమతిచ్చారని తెలిపింది. అక్కడ వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని, వారి శరీరంపై తీవ్రమైన గాయాలు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతుంది. వారు ఆత్మహత్యకు కూడా చేసుకోవాలని అనుకున్నట్లు ఆమెతో చెప్పారని వారి అక్క తెలిపింది. ఎలాగైనా తన చెల్లెళ్లను తనతో పంపించాలని భారత్ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.