అదృష్టం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని మిస్ అయితే మళ్లీ తిరిగి రాదు. కొందరు సడన్ గా కోటీశ్వరులు అవుతుంటారు. వారిని చూస్తే అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది అనిపిస్తుంది.
ఎవరికైనా అదృష్టం ఎపుడు? ఎవరిని? ఎలా? వరిస్తుందో తెలియదు. కొందరు రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి డబ్బులు కూడబెట్టుకుంటారు. మరికొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు. ఇటీవల పొలంలో ఓ రైతుకు వజ్రం దొరికితే దానిని అతను వ్యాపారికి చూపించగా అది రెండు కోట్ల విలువ చేసేదిగా తేలింది. అలాగే కేరళలో లాటరీ తగిలి ఒకరు, మరికొందరు విదేశాల్లో ఉండే భారతీయలు కూడా ఒకరోజులోనే జాక్పాట్ తగిలి ఏకంగా కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. ఇలా అదృష్టం వరించిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా చెత్తలో దొరికిన ఓ పాత పుస్తకం ద్వారా ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో..ఎలా జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
చీలీ దేశంలో ఎక్సిక్విల్ హినోజోసా అనే వ్యక్తిని అదృష్టం వరించింది. కొద్ది రోజుల క్రితం ఇల్లు శుభ్రం చేస్తుండగా అతనికి పాత కాగితాల్లో ఓ పుస్తకం దొరికింది. దానిని పరిశీలించి అది 60 సంవత్సరాల క్రితం పుస్తకంగా గుర్తించాడు. అది తన తండ్రి బ్యాంక్ పాస్ బుక్. దానిలోని అన్ని విషయాలను పరిశీలించాడు. హినోజోసా తండ్రి 1960-70 కాలంలో ఓ బ్యాంక్లో 1.40 లక్షల చిలీ మనీని డిపాజిట్ చేశాడు. ఆ డబ్బులతో ఇంటిని కొనుక్కునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇల్లు కొనకుండానే అతని తండ్రి చనిపోయాడు. దాదాపు 60 సంవత్సరాలుగా బ్యాంక్ పాస్ బుక్ చెత్త కాగితాల్లో ఉండిపోవడంతో.. అతని డిపాజిట్ చేసిన డబ్బులు బ్యాంక్లోనే ఉండిపోయాయి. ఇటీవల హినోసోసాకు పాస్ బుక్ దిరికింది. దీంతో అతను బ్యాంకు సిబ్బందిని సంప్రదించి , డబ్బుల గురించి తెలుసుకున్నాడు. బ్యాంకు సిబ్బంది తిరిగి డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పారు.
దీంతో అతడు బ్యాంక్ సిబ్బందిపై కోర్టులో కేసు వేశాడు. తాజాగా కోర్టు విచారణ జరిపి హినోజోసాకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. కోర్టు వడ్డీతో సహా డబ్బులు తిరిగి చెల్లించాలని బ్యాంకు సిబ్బందిని ఆదేశించింది. ఈ విధంగా హినోజోసా ఏకంగా 10 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా పొందాడు. తండ్రి సేవింగ్స్ 60 ఏళ్ల తర్వాత కొడుకుని కోటీశ్వరున్ని చేసింది. చెత్తలో దొరికిన పాత పాస్ పుస్తకం కారణంగా కోటీశ్వరుడు అయిన హినోజోసాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.