అమెరికాలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ అక్కడ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ మామూలుగా లేదు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. వ్యాక్సిన్ వేయించుకున్నా లేకున్నా వేరియంట్ మాత్రం విస్తరిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పేషెంట్లు ఆస్పత్రుల పాలవుతుండడంతో ఆక్సిజన్ కొరత మొదలైంది.ఫ్లోరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రులు ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నాయి. లూసియానాలో దాదాపు 2,450 మంది కోవిడ్ -19 తో ఆసుపత్రి పాలయ్యారు, గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ శనివారం చెప్పారు, ఇది గత 10 రోజుల్లో 20% పడిపోయింది. అయితే, ప్రస్తుత కేసుల పెరుగుదలకు ముందు రాష్ట్రం ఇప్పటివరకు అత్యధికంగా ఉంది.
సాధారణంగా 90 శాతం నిండి ఉండే ఆక్సిజన్ ట్యాంకులో 30-40 శాతం మిగిలి ఉండే వరకు ఆక్సిజన్ ను వాడతారు. మరో ఐదు రోజుల వరకు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు 10 శాతం స్థాయి వరకు వాడేయాల్సి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల ఒకటి రెండు రోజులకు మించి ఆక్సిజన్ నిల్వలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు హరికేన్ల కారణంగా గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోందని లూసియానా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల లోపు వారికి టీకాలు అందుబాటులో లేకపోవడం, త్వరలోనే స్కూళ్లు తెరవనుండడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడే అవకాశం ఉందని, వారితో ఆసుపత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక చిన్నారుల్లోనూ మరణాలు సర్వసాధారణం అయిపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. డిసెంబరు నాటికి దేశంలో కొత్తగా లక్ష మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొనడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండ్ వేవ్లో ఎలాంటి కష్టాలు మనం అనుభవించామో ఇప్పుడు యూఎస్ కూడా ఆక్సిజన్ షార్టేజ్తో నానా రకాల ఇబ్బందులకి గురవుతోంది.