దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అనేక మంది చనిపోయిన సంగతి విదితమే. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్ ఘటనలు నింపిన విషాదాలు మరువక ముందే..
దేశ వ్యాప్తంగా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అనేక మంది చనిపోయిన సంగతి విదితమే. దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్ ఘటనలు నింపిన విషాదాలు మరువక ముందే.. మొన్న ఓ ప్లే స్కూల్ ల్లో కూడా ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. హబ్సీగూడలో ఇటీవల రెండు దుకాణాలు తగులబడిన సంగతి విదితమే. అయితే ఇక్కడ భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇటు ఏపీలో కూడా పలుచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు దేశంలోనే ప్రతిష్టాత్మక ఆసుపత్రి ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉదయం 11. 50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ విభాగంలోని ఎండోస్కోపీ రూములో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రోగులను మరో చోటుకు సురక్షితంగా తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎండోస్కోపీ గది పాత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఉన్న రెండవ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంటలు ఎగసిపడుతున్నాయి. విపరీతంగా పొగ బయటకు వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.