ఇంటర్నేషనల్ డెస్క్- ఎలాన్ మస్క్.. ఈ ప్రపంచ కుభేరుడి గురించి ప్రక్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. టెస్లా కంపెనీ అధినేతగా, ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా అందరికి సుపరిచితమే. ఎలాన్ మస్క్ ముందు నుంచి భూరీ విరాళాలు ఇస్తూవస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మరోసారి భారీ విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు ఎలాన్.
చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇచ్చిన పిలుపుకు ఎలాన్ మస్క్ బారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ లో దాఖలు చేసిన వివరాల మేరకు, నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు ఎలాన్ మస్క్ తన వాటాలో నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన 5 మిలియన్ల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు స్పష్టం చేసింది.ఎలాన్ మస్క్ ఇచ్చిన ఈ విరాళం విలువ సుమారు 5.7 బిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 43 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఎలాన్ మస్క్ విరాళం ఒకటిగా నిలవనుందట. ఐతే తాను విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారు అనేది మాత్రం ఎలాన్ మస్క్ చెప్పలేదు.
ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు అంటే సుమారు 45 వేల కోట్లు అవసరమని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే గతంలో అన్నారు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్ నిరుపేదల ఆకలి బాధల నిర్మూలనకు తాను సాయం చేస్తానని చెప్పారు. ఇదిగో ఇప్పుడు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏకంగా 43 వేల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు.