మనీ డెస్క్- ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం కొందరిరి కష్టమైన పని ఐతే, మరికొంత మందికి చాలా సులభం. ఇక సంపాదించిన డబ్బును దాచుకోవడం, లేదంటే ఆ డబ్బులను పెట్టుబడిగా పెట్టి ఆదాయం పొందడం కొంతమందికి మాత్రమే సాధ్యం. ప్రభుత్వం అందించే వివిధ పధకాల్లో డబ్బులు జమ చేస్తే మంచి ఆదాయంతో మన డబ్బులను తక్కువ సమయంలోనే రెట్టింపు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్లో చాలా రకాల పధకాలున్నాయి. పోస్టాఫీస్ కు సంబందించిన స్కీమ్స్ లో డబ్బులు పెడితే కచ్చితమైన రాబడి పొందొచ్చు. అంతే కాదు అసలు ఏ మాత్రం రిస్క్ ఉండదు. మనం పెట్టిన పెట్టిన పెట్టుబడి భద్రంగా ఉండటమే కాకుండా మనకు పెట్టుబడిపై మంచి రాబడి కూడా వస్తుంది.
పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో కిసాన్ వికాస్ పత్ర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పధకంలో డబ్బులు పెడితే దానికి రెట్టింపు రాబడి పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర్ లో మీరు పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది. ఇక ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు.
పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర్ పథకంలో చేరాలంటే కనీసం 1000 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడానికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ స్కీమ్పై ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. 124 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది.
అంటే మనం 5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే, 124 నెలల్లో ఏకంగా 10 లక్షల రూపాయలు అవుతుంది. మీకు దగ్గర్లోని పోస్టాఫీస్కు వెళ్లి కిసాన్ వికాస్ పత్ర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని, వెంటనే ఈ స్కీమ్ లో చేరిపొండి మరి.