స్పెషల్ డెస్క్- కరోనా ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఇంకా కరోనా భయం పోలేదు. ఎందుకంటే రెండు వేవ్ లతో ప్రపంచాన్ని అల్లాడించిన కరోనా.. మళ్లీ ధర్డ్ వేవ్ ద్వార విరుచుకుపడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ధర్డ్ వేవ్ ఎంత మేర ఉపద్రవాన్ని కలిగిస్తుందోనని అంతా వణికిపోతున్నారు. ఇక కరోనాకు ఇప్పటి వరకు నిర్ధిష్టమైన మందు లేదని చెప్పవచ్చు. ఓ వైపు కరోనాకు ఔషదాన్ని కనుగొనే పనిలో ఉంటూనే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో కరోనాకు చికిత్స అందిస్తున్నారు.
కరోనాను ఎదుర్కోవాలంటే మన శరీరంరో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని వైద్యులు చెప్పారు. దీంతో అంతా బలవర్ధకమైన ఆహారంపై దృష్టి పెట్టారు. కొవిడ్ వ్యాక్సిన్ కూడా అందరికి అందుబాటులో లేకపోవడంతో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు అంతా. కొంత మంది వ్యాయామాలు, యోగా చేస్తే.. మరికొందరు కషాయాలు తాగాడం, విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం చేశారు. ప్రత్యేకంగా మార్కెట్లో దొరికి పలు కంపెనీలకు చెందిన ఇమ్యునిటీ బూస్టర్స్ ను తీసుకున్నారు చాలా మంది.
దీంతో కరోనా సమంలో భారతీయులు తీసుకున్న ఇమ్యునిటీ బాస్టర్స్ పై ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గత సంవత్సర కాలంలో విటమిన్ సప్లిమెంట్లు, ఇమ్యూనిటీ బూస్టర్స్ కోసం భారతీయులు ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తేలింది. 2019 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 5 రెట్లు ఎక్కువట. కరోనా కాలంలో జనం అంతా ఆరోగ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో అంతా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రధ్ద పెట్టారు. కరోనా టైంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పెద్ద ఎత్తున ఇమ్యునిటీ బాస్టర్స్ పై ఆధారపడ్డారు.