బాలికా వధు- చిన్నారి పెళ్లికూతురు (తెలుగు డబ్బింగ్) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి – తమస్, మమ్మో , బధాయ్ హో చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకున్నారు. బాలికా వధు బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఆమెను అందరికీ దగ్గర చేసింది మాత్రం బాలిక వధు -చిన్నారి పెళ్లికూతురు అనే ధారావాహికే. 2013 ఉయ్యాల జంపాలా చిత్రంతో పరిచయమైన అవికాగోర్ కి ఈ బాలికా వధు మంచిపేరు తెచ్చిన సంగతి విదితమే
2018లో షూటింగ్ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖ సిఖ్రికు బ్రెయిన్ స్ర్టోక్ వచ్చింది. కోలుకుంటున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అప్పటినుంచి నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. కుటుంబ విషయానికి వస్తే ఆమె హేమంత్ రెగెను వివాహం చేసుకున్నారు. రాహుల్ సిక్రీ అనే కుమారుడు ఉన్నారు.
సురేఖ సిఖ్రి బాలికా వధూ సీరియల్తో ప్రతి ఇంటికి చేరువైంది. ఈ సీరియల్లో గడుసరి, మొండి, కోపిష్టి, ప్రేమను పంచే బామ్మగా సురేఖా సిక్రీ అందరినీ ఆకట్టుకున్నారు. చివరగా ఆమె నెట్ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్’లో జాన్వీ కపూర్తో కలిసి నటించింది. ఆమె మరణ విషయాన్ని తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.