అయితే ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించి సూపర్ హిట్ అందుకున్నారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశాయి. ఇక, లెజెండ్ సినిమాలో ఓ చిన్న పాపతో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్లో బాలకృష్ణ ఆ పాప మెడలో చైన్ వేసి ‘ఏదీ మామయ్యా అని పిలవమ్మా’ అని అంటాడు. ఆ సీన్ సోషల్ మీడియా చాలా పాపులర్ అయింది.
మీమర్స్ అందులోని దృశ్యాలను తెగవాడేస్తున్నారు. ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్న పాప ఎవరో మీకు తెలుసా?.. ఆ పాప ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చిన్న వయసులోనే బాలయ్యతో నటించిన ఆ పాప పేరు జోషిత. ఆ పాప ఇంకెవరో కాదు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను కూతురు. బేబీ జోషిత తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక, జోషిత తన తండ్రి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం కావటం విశేషం.
బోయపాటి శ్రీను ముగ్గురు సంతానం. ఆ ముగ్గురిలో జోషిత ఒకరు. కాగా, బోయపాటి శ్రీను.. బాలయ్య బాబు మొదటి సారి ‘సింహ’ సినిమాతో టీమ్గా మారారు. 2010లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లెజెండ్ సినిమా చేశారు. ఆ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇక, వీరిద్దరూ ముచ్చటగా మూడో సారి ‘అఖండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది.