తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడి వీధుల్లో నలిగిపోతుంటే.., చూసి సహించలేక, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆ తరువాత 9 నెలల్లోపే అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తాని దేశ వ్యాప్తంగా తెలియచేశారు యన్టీఆర్. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చేసింది. బూత్ స్థాయి నుండి క్యాడర్ బిల్డ్ చేసుకోవడంలో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. తన చుట్టూ పొలిటికల్ గా ఒక కోటరీని సెట్ చేసుకున్నారు. బాబు మీద ఎవరు విమర్శలు చేసినా.., వీరంతా కలసి ప్రత్యర్థులను ఏకి పారేసేవారు. చంద్రబాబు నుండి ఏవైనా ఆదేశాలు వస్తే పాటించడానికి ఆయా జిల్లాలలో సీనియర్ నాయకులు సైతం సిద్ధంగా ఉండేవారు. ఇలా.., రాజకీయాల్లో చంద్రబాబుకి మంచి అనుచర వర్గం ఉండేది. కానీ.., ఇప్పుడు తన పార్టీ నాయకులు, అనుచరులు, సన్నిహితులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబుకి తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందట.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ముఖ్య నాయకులు ఎవరూ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా లేరు. పార్టీ బాధ్యతలను మోసేందుకు మాజీ మంత్రులు ఎవరూ ముందుకు రాకపోవడం లేదట. వారికి చంద్రబాబు నేరుగా ఫోన్ చేసినా అందుబాటులోకి రావడం లేదట. దీంతో.., మరో మార్గం లేక జూనియర్లు, బయట పార్టీల నుంచి వచ్చిన వారిని పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా నియమించాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల్ని ఇటీవల ప్రకటించారు. అక్కడ చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు లాంటి సీనియర్ నాయకులు చేతులెత్తేయడంతో చంద్రబాబుకి మరో అవకాశం లేకుండా పోయింది. ఇక విజయవాడ, గుంటూరు పార్లమెంటు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. గుంటూరులో పత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్ లాంటి చాలామంది సీనియర్లు ఉన్నా, ఒక్కరు కూడా బాధ్యతలను తీసుకోవడానికి ముందుకి రాలేదట.
ఇవన్నీ కాకుండా.., అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిల వ్యవహారం కూడా చంద్రబాబుకు నిద్రలేని రాత్రులను మిగిలిస్తోందట. సుమారు 100కిపైగా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు అధినేతకు సైతం అందుబాటులోకి రావడం లేదట. పార్టీ బలపడేలా ఏమైనా చర్చలు చేద్దామన్నా వారంతా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదట. పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్లు నియోజకవర్గాలలో కూడా ఉండటం లేదు. అధికార పక్షంపై విమర్శలు చేసిన వారంతా జైల్లో ఊసలు లెక్కేయాల్సి వస్తుండటంతో టీడీపీ నాయకులు బాబు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదట. ఇలా.., ఎవ్వరి సహకారం లేకుండా పార్టీని ఎలా ముందుకి నడిపించాలి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా లాభపడ్డ సీనియర్స్ కూడా.., ఇప్పుడు బాధ్యతలని తీసుకొని రావడానికి ముందుకి రావడం లేదని చంద్రబాబు తీవ్ర దుఃఖానికి లోనవుతున్నారట. మరి.., నాయకుల చేతిలో మోసపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీకి తిరిగి జవసత్వాలను ఎలా అందిస్తారో చూడాలి.