మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గొప్ప మనసు చాటుకున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపాడు.
తన మార్క్ ఆటతో క్రికెట్ లో తనదైన ముద్రవేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. కాగా ఇటీవల జరిగిన ఐపిఎల్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిధ్దం చేసుకున్నారు. దానిలో భాగంగానే సిఎం జగన్ ను కలిసిన అంబటి రాయుడు పొలిటికల్ గా ఆక్టీవ్ గా మారాడు. ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీచేస్తానని స్పష్టం చేశారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఈ క్రమంలో ప్రజలతో మమేకమవుతూ, పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ స్కూల్ అభివృద్ధి కోసం రూ. 5 లక్షలు విరాళంగా అందించారు. ఈ విషయంపై పలువురు రాయుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
టీమిండియా ప్లేయర్ గా జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లలో క్రికెట్ ఆడి పేరు ప్రఖ్యాతులు సాధించిన అంబటి రాయుడు, పాలిటిక్స్ లో కూడా రాణించాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం రూట్ మ్యాప్ సిద్దం చేసుకుంటున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎపిలోని పలు ప్రాంతాల్లోపర్యటిస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రజల్లో కలియతిరుగుతు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఈరోజు ముట్లూరులో పర్యటించిన అంబటి రాయుడు సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి 5 లక్షల చెక్కును అందజేశారు. భవిష్యత్తులో కూడా పాఠశాల ఆధునీకీకరణకు తనవంతు సాయం చేస్తానని తెలిపాడు. ఆ తరువాత పాఠశాల యాజమాన్యం అంబటి రాయుడిని శాలువాతో సత్కరించింది. గొప్ప మనసు చాటుకున్న అంబటి రాయుడిపై నెటిజన్స్ ప్రశంసలుకురిపిస్తున్నారు.
Donated a cheque of 5 lakhs to st xaviers high school in Mutluru for the development of the school. Also promised the refurbishment of the whole school building and the grounds. Playing my part in restoring the old glory of a very prestigious and a famous school. pic.twitter.com/6wpuJyseWb
— ATR (@RayuduAmbati) July 13, 2023