సూపర్ స్టార్ మహేష్ బాబు – అగ్రదర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇద్దరూ కూడా వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
మరోవైపు త్రివిక్రమ్.. మహేష్ కోసం పకడ్బంధీగా స్క్రిప్ట్ రెడీ చేస్తూనే.. సినిమా కోసం కాస్టింగ్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా మహేష్ – త్రివిక్రమ్ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి.. తెలుగులో ఉప్పెన సినిమాతో డెబ్యూ చేశాడు. మరి మహేష్ సినిమాకు ఓకే చెప్పాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక మహేష్ తో దాదాపు 11 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ ఈ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. మహేష్ సరసన రెండోసారి జతకట్టబోతుంది బుట్టబొమ్మ పూజాహెగ్డే. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నాడు. మరి మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.