మన ఇంట్లో మనుషులతోనే కాదూ.. జంతువులు, పశు, పక్షాదులతో బంధాలు పెంచుకుంటుంటాం. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఆవులు, గెదేలు వంటి వాటిని ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటుంటాం. ఇక కుక్కలు, పిల్లులకైతే.. ఇంట్లో స్థానం కల్పిస్తుంటాం
మన ఇంట్లో మనుషులతోనే కాదూ.. జంతువులు, పశు, పక్షాదులతో బంధాలు పెంచుకుంటుంటాం. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, చిలుకలు, ఆవులు, గెదేలు వంటి వాటిని ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటుంటాం. ఇక కుక్కలు, పిల్లులకైతే.. ఇంట్లో స్థానం కల్పిస్తుంటాం. వాటికి అలవాటు అయిపోయి, వాటితో ఆడుతూ, పాడుతుంటాం. ఒక్కనిమిషం అవి కనిపించకపోతే.. విలవిలలాడిపోతుంటాం. అలాంటిది అవి శాశ్వతంగా దూరమైతే.. ఇంట్లో సభ్యులను కోల్పోయామన్న ఫీలింగ్ కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార కూడా ఇదే బాధలో ఉన్నట్లు కనిపిస్తుంది. అవును మరీ ఆమెకు ఎంతో ఇష్టమైన పెట్ డాగ్ చనిపోయింది.
మహేష్ బాబు కుటుంబం పెంచుకుంటున్న పెట్ డాగ్స్లో ఒకటి ఫ్లూటో. అది ఇప్పుడు చనిపోయినట్లు తెలుస్తోంది. సుమారు 7 ఏడు సంవత్సరాల పాటు ఆ కుటుంబంలో ఉన్న ఈ డాగ్ చనిపోవడంతో సీతూ పాప కన్నీరు మున్నీరు అవుతున్నట్లు కనిపిస్తోంది. డాగ్ మిస్ అవ్వడం పట్ల ఆమె ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఏడేళ్ల బంధం.. మిస్ యూ అంటూ కుక్కతో తనకున్న బంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. కాగా, ఆమెను ఓదార్చేందుకు తల్లి నమత్ర రిప్లై ఇచ్చింది. ప్లూటో ఎక్కడికి వెళ్లదు.. మనతో ఉంటుంది.. మన ప్రేయర్స్లో ప్లూటో ఎప్పుడూ ఉంటుందని సితార పోస్టుకు నమ్రత కామెంట్ పెట్టింది. అంతే కాకుండా నమత్ర సైతం ఫ్లూటో మృతిపై విడిగా పోస్టు పెట్టింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం.. నువ్ మా గుండెల్లో మా ప్రార్థనల్లో ఎప్పటికీ ఉంటావ్ అని నమ్రత సైతం స్పెషల్గా పోస్ట్ వేసింది.