వెన్నెల కిషోర్.. ఈయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు ఫక్కున నవ్వుతారు. వెన్నెల సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న కిశోర్ తెలుగులో చాలా బిజీగా ఉండే కమెడియన్. ఇటీవల హీరో నితిన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో వెన్నెల కిశోర్ కూడా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించేసింది.
ఈ సినిమా టీమ్ తో ఒక స్పెషల్ చిట్ చాట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా హీరో నితిన్, వెన్నెల కిశోర్ ముందే అక్కడకు చేరుకుని వెయిట్ చేస్తుంటారు. ఇంకా కృతి శెట్టి రాకపోవడంతో వెన్నెల కిశోర్ ఆమెపై సెటైర్లు విసురుతుంటాడు. ‘ఆమె ఎవరు కొరియన్ సినిమా హీరోయిన్లా ఉంటుంది. ఏంటో ఇన్ స్టాగ్రామ్ వేళ్లు చూపిస్తూ ఉంటుంది. చిటికేస్తుందో ఏంటో అర్థం కాదు. ఏంటి ఇంకా కొరియాలో ఉందా ఇంకా రాలేదు?’ అంటూ వెన్నెల కిశోర్ అసహనం వ్యక్తం చేస్తాడు.
ఈ గ్యాప్ లో కృతి శెంట్టి రావడంతో కూర్చోమని చెప్పి వెన్నెల కిశోర్ కాస్త శాంతిస్తాడు. అయితే ఇదంతా ప్రమోషన్లో భాగంగానే చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకటే మాచర్ల నియోజకవర్గంలో వెన్నెల కిశోర్ ఒక ఇగో ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడు. చిట్ చాట్ లో కూడా తన పాత్రలోనే ఉండి అలా కాసేపు వాళ్లను ఆడుకున్నాడు. ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేసిన యాంకర్ శ్యామలానే ఈ చిట్ చాట్ను హోస్ట్ చేయడం విశేషం. కృతి శెట్టిపై వెన్నెల కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.