వనితా విజయ్ కుమార్ నిత్యం వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. సినిమా విషయాల్లో కంటే వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ నాలుగో పెళ్లి కూడా చేసుకుంటుందంటూ ఆ మధ్య ఓ జోతిష్కుడు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె దివంగత నేత జయలలిత లాగా కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తుందని పేర్కొన్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోను షేర్ చేసి అభిమానులకి షాక్ ఇచ్చింది వనిత.
సీనియర్ నటుడు విజయ్ కుమార్ , నటి మంజుల దంపతుల పెద్ద కూతురే వనిత అన్న విషయం తెలిసిందే. ‘చంద్రలేఖ’ చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్బాస్ షోలో హల్చల్ చేసింది. ఇటీవల ఓ టీవీ షో విషయంలోనూ సీనియర్ నటి రమ్యకృష్ణతో గొడవ పడి బయటకు వచ్చేసింది. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో ‘కీ’ రోల్ పోషించింది.
వనిత 2000లో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకొని 2007లో అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ని పెళ్లి చేసుకుంది. 2012లో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం పీటర్ పాల్ అనే వ్యక్తిని అక్టోబర్ 2020లో వివాహం చేసుకొని పరస్పర అంగీకారంతో అతనితో విడాకులు తీసుకుంది.
ఆమె నాలుగో పెళ్లి చేసుకున్నదంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవర్ స్టార్ శ్రీనివాసన్తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కొందరు కామెంట్లు పెట్టారు.
మరి కొందరు ఈ మొగుడితోనైనా కొంతకాలం ఉంటావా? లేక ఇతడిని కూడా వదిలేస్తావా? అంటూ కామెంట్లు పెట్టారు. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే – నిజానికి వనిత కొత్తగా ఎవరిని పెళ్లి చేసుకోలేదు.
ఆమె నటిస్తున్న సినిమా ‘వాసువిన్ 4 కార్పినిగల్’ లో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా జరిగిన వివాహం అది. అయితే సినిమా ప్రమోషన్ కోసమే ఆ చిత్ర యూనిట్ ఇటువంటి ట్రిక్ ప్లే చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.