యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె ఎనర్జీ, కామెడీ టైమింగ్ అన్నీ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. శ్రీముఖి ప్రస్తుతం యాంకరింగ్ మాత్రమే కాకుండా.. సినిమాలు కూడా చేస్తోంది. అటు బుల్లితెర ప్రేక్షకులను.. ఇటు వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.
యాంకర్ శ్రీముఖి అలియాస్ రాములమ్మకి తెలుగు ప్రేక్షకుల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అటు యాంకరింగ్ తో అలరిస్తూనే.. ఇటు సినిమాల్లో కూడా అవకాశాలతో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెరలో శ్రీముఖి గొంతుకు ఎంతటి సెలబ్రిటీ అయినా భయపడాల్సిందే. ఈమె చాలా షోస్ తో ఫుల్ బిజీగా ఉంటోంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఎవరు విన్నర్ గా నిలుస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ ఫైనల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా హాజరయ్యాడు. అలాగే శివ బాలాజీ, హీరోయిన్ నేహా జడ్జిలుగా ఉన్నారు. ఈ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా వివిధ ఆటలు, టాస్కులు అంటూ కంటెస్టెంట్ దంపతులను ఆడేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన జంట రాకింగ్ రాకేష్- సుజాత కూడా ఉన్నారు. టాస్క్ ఆడే క్రమంలో శ్రీముఖి రాకింగ్ రాకేష్ కి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా అలా ఇలా కాదు.. లఫూట్, ఎంట్రా అంటూ రెచ్చిపోయింది. శ్రీముఖి ఆ రేంజ్ లో ఫైర్ కావడంతో రాకేష్ కూడా చేసిది లేక చూస్తుండిపోయాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఎపిసోడ్ లో భాగంగా జంటలకు బాస్కెట్ బాల్ కాంపిటీషన్ పెట్టారు. ఒకరు కళ్లకు గంతలు కట్టుకుని బాల్ వేస్తే రెండో వాళ్లు ఒక స్టూల్ మీద నిల్చొని దానిని బాస్కెట్ లో పడేలా చేసి గోల్ చేయాలి. మొదటి రాకేష్ బాల్స్ వేయగా.. సుజాత పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, గోల్ కాదు. ఆ తర్వాత సుజాత బాల్ విసరగా.. రాకేష్ వాటిని పట్టుకునేందుకు ట్రై చేస్తాడు. ఆ క్రమంలో రెండుసార్లు స్టెప్ పడిన బంతిని గోల్ చేస్తాడు. అదేంటి రెండుసార్లు స్టెప్స్ పడితే లేదా అని ప్రశ్నిస్తాడు. అందుకు శ్రీముఖి “దొబ్బిందమ్మా.. 2 స్టెప్స్ లేవని ముందే చెప్పినాగారా లఫూట్.. చేయి లేస్తుందేంద్రా మళ్లీ కాపురానికి పనికి రాకుండా పోతావ్ చెప్తున్నా” అంటూ ఊర మాస్ స్టైల్ లో వార్నింగ్ ఇచ్చేసింది.