ఇటీవల కాలంలో బుల్లి తెరపై ప్రత్యేకమైన షోలు నడుస్తున్నాయి. పండుగలు, ప్రత్యేకమైన దినాలను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్లుగా షోలను డిజైన్ చేస్తున్నారు. జనవరి 1తో మొదలయ్యే ఏడాది ప్రారంభం నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ను క్రియేట్ చేసి ప్రేక్షకులపై వదులుతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు స్టార్ నటీనటులు అతిధులుగా వస్తుండటంతో.. వాటికి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఎలాగూ పండుగ, ప్రత్యేకదినాల్లో సెలవులే కావడంతో టివిలకు అతుకుపోతున్నారు జనాలు. దీంతో వీటికి రేటింగ్ బాగా వస్తోంది. ఫిబ్రవరి అనగానే గుర్తుకు వచ్చేది వాలంటైన్స్ డే. దీంతో తమ రేటింగ్ లకు పెంచుకునేందుకు ప్రత్యేక షోలు రూపొందిస్తున్నాయి టెలివిజన్ సంస్థలు.
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ చానల్ లవ్ టుడే పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఓ ప్రోమోను విడుదల చేసింది. రీల్ వర్సెస్ రియల్ జంట పేరుతో పలు జంటను ఆహ్వానించింది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు సిరి హన్మంత్, శ్రీహాన్ లు సందడి చేశారు. శ్రీహన్కు గోల్డ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసిన సిరి, అతడూ చాలా యూనిక్ అంటూ పొగిడింది. శ్రీహన్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అతడిని చాలా మిస్ అయ్యానని, గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ షర్ట్ పై ముద్దులు పెట్టేదాన్నంటూ ఆ షర్ట్ అతడికి గిఫ్ట్ గా ఇచ్చింది. పలు గిఫ్ట్ లతో పాటు సర్ ప్రైజెస్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయింది.‘చిన్న, చిన్న తప్పులు ఎవ్వరైనా చేస్తారని, కానీ స్టేజ్ పై ఎవ్వరూ ఒప్పుకోరని, నేను నిజంగానే, నాకు తెలియకుండా తప్పు చేశాను’అంటూ కన్నీటి పర్యంతం అయింది.
దీంతో సిరిని శ్రీహన్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. వీరితో పాటు యాంకర్ రష్మీ కూడా ఓదార్చేందుకు ముందుకు వచ్చారు. బిగ్ బాస్ 5 సీజన్ కంటెస్టెంట్లుగా వచ్చారు యూట్యూబర్ స్టార్లు షణ్ముఖ్ జస్వంత్, సిరిలు. అప్పటికే షణ్ముఖ్.. దీప్తి సునయనతో సిరి, శ్రీహన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఈ షోలోకి అడుగుపెట్టిన సిరి, షణ్ముఖ్ స్నేహం శృతి మించింది. ఒక బెడ్ పై పడుకోవడంతో పాటు హగ్గులు, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్.. ఈ చర్యలతో రన్నరప్ గా నిలిచాడు. అయితే ఈ షో తర్వాత షణ్ముఖ్ తో దీప్తి బ్రేకప్ చెప్పుకోగా.. సిరి, శ్రీహాన్ లు కూడా విడిపోయి, మళ్లీ కలుసుకున్నారు. ఇప్పుడు దీన్నే తప్పుగా భావిస్తూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారో ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ షో ఆదివారమే ప్రసారం కానుంది.