సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక మనసన్న మనిషిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, చేతనైన సాయం చేయడం సినిమాల్లో మాత్రమే కాదు.. రియల్ లైఫ్లోనూ మహేశ్ ఎన్నో దానాలు, సాయాలు చేస్తూనే ఉంటాడు. ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎన్నో కుటుంబాల్లో నవ్వులు పూయిస్తున్నాడు.
వెండితెరపై మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన కుమార్తె సితారతో కలిసి జీ తెలుగు నిర్వహిస్తున్న ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే షోలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ గా మారింది. అయితే అంతా మహేశ్ బాబు గెస్ట్ గా వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు అనుకుంటున్నారు.
అయతే మహేశ్ అలా రావడం వెనుక పెద్ద కారణమే ఉంది అనే టాక్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఆ ఛానల్ యాజమాన్యం మహేశ్ బాబుతో ఓ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒక సంవత్సరం పాటు ఆ ఛానల్ వాళ్ల షోలు, ఇంటర్వ్యూలలో మహేశ్ కనిపించనున్నట్లు చెబుతున్నారు. అందుకు మహేశ్కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్లో మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ చూసే ఎన్నో సంస్థలు, కంపెనీలు మహేశ్ను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాలంటూ కోరుతుంటాయి. అందుకు కోట్లలో ఆఫర్ చేస్తుంటాయి. ఇప్పుడు బుల్లితెర కనిపించేందుకు ఏడాదికి మహేశ్కు రూ.9 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మహేశ్ క్రేజ్ ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మహేశ్ బుల్లితెరపై సందడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.