సాధారణంగా రియాలిటీ షోల్లో ఎంటర్ టైన్ మెంట్ కోసం ఏది వీలైతే అది చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు. కొన్నాళ్ల ముందు వరకు ఇదే కొనసాగింది. ఎప్పుడైతే సుధీర్-రష్మీ జోడీ క్లిక్ అయిందో అప్పటి నుంచి ప్రతి షోలోనూ జంటల హడావుడి పెరిగిపోయింది. ఒకరని కాదు ప్రతి ఒక్కరికీ.. సదరు షో క్రియేటర్స్ ఎవరినో ఒకరిని జంటగా అటాచ్ చేసేవారు. వాళ్లు పండించే కామెడీ, ప్రేమ.. ఆడియెన్స్ ని చాలా బాగా అలరించేవి. అయితే వీటిలో కొన్ని రియల్ జోడీలు కూడా ఉన్నాయి. వారిలో రాకేష్-సుజాత కచ్చితంగా ఉంటారు.
ఇక విషయానికొస్తే.. మిమిక్రీ, వెంట్రిలాక్విజంతో పేరు తెచ్చుకున్న రాకేష్, ‘జబర్దస్త్’లో తొలుత ఓ కమెడియన్ గా చేశాడు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ పేరుతో ఓ టీమ్ నే నడిపిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ షోలో చేస్తున్న మనోడు.. గత కొన్నాళ్ల నుంచి సుజాతతో ఎక్కువగా స్కిట్స్ చేస్తున్నాడు. వీళ్ల మధ్య ఏదో ఉందని అందరూ అనుకోవడానికి కంటే ముందే తాము ప్రేమలో ఉన్న ఇన్ డైరెక్ట్ గా బయటపెట్టాడు. వీళ్లు పెళ్లి చేసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది.
అయితే ఈ మ్యారేజ్ జరగడానికి ఇంకా టైం ఉన్నట్లు కనిపిస్తుంది. స్కిట్ లో ఎప్పుడూ కలిసి కనిపించే వీళ్లు.. ఇప్పుడు టూర్స్ కి కూడా వెళ్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా దుబాయి వెళ్లిన ఈ జోడీ.. బూర్జ్ ఖలీపా టవర్ ముందు తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే ఈవెంట్ కోసం వెళ్లారా? పర్సనల్ గా వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ‘జబర్దస్త్’తో పాటు ‘మిస్టర్ అండ్ మిసెస్’ షోలోనూ వీళ్లిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. మరి ఈ జోడీ.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనేది చూడాలి.