అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై యాంకర్ రష్మి స్పందించింది.
అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు వదలడం అత్యంత విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఇక ఇప్పటికే వీధి కుక్కల దాడిపై స్పందించారు మంత్రి కేటీఆర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి. ఈ ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ పేర్కొనగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం అని మేయర్ తెలిపారు. ఇక తాజాగా ఈ ఘటనపై స్పందించింది యాంకర్ రష్మి.
యాంకర్ రష్మి.. జబర్దస్త్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే రష్మిలో ఉన్న మరో కోణాన్ని లాక్డౌన్ లో మనకు చూపించింది. కరోనా కాలంలో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించి మంచి మనసును చాటుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంబర్ పేటలో జరిగిన వీధి కుక్కల దాడిపై స్పందించింది యాంకర్ రష్మి. తన సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. ట్వీటర్ లో రష్మి ఈ విధంగా రాసుకొచ్చింది.”ఈ ఘటనలో ఆ బాలుడి తప్పేంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల సంతాన ఉత్పత్తి, వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించాలి” అంటూ రష్మి చెప్పుకొచ్చింది. వాటికంటూ ఓ సపరేట్ ప్లేస్ ను మనం అందిచాలని రష్మి అన్నారు. అంబర్ పేట వీధి కుక్కల ఘటన ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Unfortunately yes the little boy did die for no fault of his and a long term solution of birth control,vaccination and shelter shud be implemented
Animals are territorial just like us they need there own space https://t.co/GTZ1UhRlCN— rashmi gautam (@rashmigautam27) February 21, 2023