ఏ రంగంలోనైనా కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. అది సినిమా రంగంలోనైతే ఇక చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజీ కాంబినేషనే బాలీవుడ్ లో రాబోతుంది. తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘జవాన్’. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
డైరెక్టర్ అట్లీ.. హీరో ఆర్య, నయనతార నటించిన రాజా రాణీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత వరుసగా దళపతి విజయ్ తో ‘తేరి, మెర్సల్, బిగిల్’ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ ని అందించాడు. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో ఓ ముఖ్య అతిథి పాత్రలో దళపతి విజయ్ నటిస్తున్నట్లు తెలిసింది.
షారుఖ్ జవాన్ మూవీలో విజయ్ కేవలం 5నిమిషాలు మాత్రమే కనిపిస్తారని వినికిడి. దాని కోసం హీరో విజయ్ ఒక రోజు డేట్ కేటాయించారట. కానీ రెమ్యూనరేషన్ ఒక్క పైసా కూడా తీసుకోట్లేదట. దానికి అట్లీ, షారుఖ్ ఖాన్ విజయ్ ల మధ్య ఉన్న స్నేహమే కారణమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో సన్యా మల్హోత్ర కీలక పాత్ర పోషిస్తుండగా, వచ్చే ఏడాది జూన్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. షారుఖ్ చిత్రంలో విజయ్ అతిథి పాత్ర చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Recent buzz
Our Thalapathy had been playing a guest role in @iamsrk jawan movie and he did not get salary for acting that movie for @iamsrk @actorvijay pic.twitter.com/Hz3uOL2Qsw— Fangirls (@Fangirl43472491) July 10, 2022