నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెరకెక్కింది. 2017లో విడుదలైన ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించగా.. వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మించారు. అయితే.. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన కథతో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ శాతకర్ణిగా నటించాడు. దీంతో ఈ సినిమాకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు.
ఈ క్రమంలో వినోద పన్ను మినహాయించినా.. సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని సినీప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినిమాకు పన్ను రాయితీ లభించినప్పటికీ, ప్రేక్షకులకు ప్రతిఫలం అందలేదని.. టికెట్ రేట్లు అంతే అమ్మారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక పన్ను రాయితీ పొందిన డబ్బులన్నీ చిత్ర నిర్మాతల నుండి రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్ లో కోరినట్లు సమాచారం.
ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించి.. నటుడు బాలకృష్ణతో పాటు ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలకు, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. అదే సమయంలో విడుదలైన రుద్రమదేవి సినిమాకి ఏపీలో పన్ను రాయితీ లభించలేదని దర్శకుడు గుణశేఖర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రుద్రమదేవి నిర్మాత గుణశేఖర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే అంశంలో నోటీసులు జారీ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Breaking::::
Supreme court issued notice to Balakrishna’s GAUTHAMI PUTRA SHARHAKARNI and Gunashekhar’s RUDRAMA DEVI film makers
Both production houses got the tax exemption from the Govt’s and didnt reduce the ticket prices..
Petition filed by movie veiwers association
— suzen (@Suzenbabu) August 29, 2022