బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోతారు. ఇక ఫ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. థియేటర్ ఎంత దూరంలో ఉన్నా సరే సినిమా చూసేయాలని పరుగులు పెడతారు. ఎక్కడ లేని పండగంతా సినిమా థియేటర్స్ దగ్గరే ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచో అభిమానులు వచ్చి సినిమా చూస్తారు. పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు ఫ్యాన్స్ థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తారు. మరి ఆ రచ్చ మరీ ఎక్కువైతే థియేటర్ యాజమాన్యం ఊరుకుంటుందా? సినిమా ఆపి ఫ్యాన్స్ ని బయటకు పంపించేస్తుంది. ఇక ఒక హీరో సినిమా రిలీజ్ కి మేకపోతుని బలివ్వడం అనేది బాలకృష్ణ ఫ్యాన్స్ కే చెల్లింది. ఇట్లుంటారు బాలకృష్ణ అభిమానులు.
బాలకృష్ణ సినిమా అంటే గత్తర లేపాలనుకుంటారు అభిమానులు. అయితే ఓ అభిమాని మాత్రం తన అభిమాన హీరో సినిమా చూడకుండానే లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన ఎదురైంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా బాలకృష్ణ అభిమానులు వీర సింహారెడ్డి సినిమా చూసేందుకు భారీగా తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బాలకృష్ణకు అభిమానులు ఎక్కువ. ముఖ్యంగా ఎమ్మిగనూరు, ఆదోని పట్టణాల్లో బాలకృష్ణకు వీరాభిమానులు ఉంటారు.
అలాంటి వారిలో ప్యాపిలి మండలం సిద్ధన గట్టుగ్రామానికి చెందిన దొరగారి చిన్న రంగ స్వామి ఒకరు. డోన్ లో వీర సింహారెడ్డి సినిమా చూసేందుకు ఆటోలో కుటుంబ సమేతంగా బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలోనే గుండెపోటుతో మరణించాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలియదు కానీ అతని మరణంతో.. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రంగస్వామి చనిపోవడంతో అతని భార్య, పిల్లలు అనాథలయ్యారు. చిన్న వయసులోనే భర్త మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారో? మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.