తెలుగు బుల్లితెరపై వినోద ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ.. మొదలైనప్పటి నుండి అటు ఎంటర్టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త థీమ్, కాన్సెప్టులతో అలరిస్తున్న ఈ షోలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరినో ఈ స్టేజిపై పరిచయం చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. సినీనటి ప్రగతి జడ్జిగా కనిపించిన ఈ ప్రోమోలో సీనియర్ హీరోయిన్ సంఘవి స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. అయితే.. ఈ ప్రోమోలో హైపర్ ఆదితో పాటు పలువురు సీరియల్ ఆర్టిస్టులు జంటగా వచ్చి సందడి చేశారు.
ఈ క్రమంలో స్టేజిపై చేసిన పెర్ఫార్మన్స్ లలో జబర్దస్త్ ఫైమా, ప్రవీణ్ ల లవ్ ప్రపోజల్ హైలైట్ గా నిలిచింది. అయితే.. మొన్నటివరకూ ఫైమా, ప్రవీణ్ ఫ్రెండ్స్ అని భావిస్తున్న ప్రేక్షకులకు ఈ లవ్ సీన్ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి. ఫైమా, ప్రవీణ్ ల లవ్ ట్రాక్ అయిపోయిన వెంటనే స్టేజిపైకి వచ్చిన హైపర్ ఆది.. యాంకర్ రష్మీని ‘ఇందాక నువ్వు ఎమోషనల్ అవ్వడం నేను చూశాను. నువ్వేమి మిస్ అవ్వట్లేదా?’ అని అడిగాడు.
ఇక ఆది ప్రశ్నకు ఎమోషనల్ అయిన రష్మీ.. బాగా ఆలోచించి ‘మనసులకు, దూరానికి ఏం సంబంధం ఉండదు. అవి ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాయి’ అని చెప్పింది. దీంతో రష్మీ మాటలపై సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మీ మాటలన్నీ సుధీర్ ని ఉద్దేశించేనని, అతన్ని చాలా మిస్ అవుతుంది కాబట్టే అంత ఎమోషనల్ గా ఆ మాట చెప్పిందని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం వైరల్ అవుతున్న రష్మీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.