సినీ ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలు ఏం చేసినా ఫ్యాన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. కొత్త సినిమాలు అనౌన్స్ చేసినా లేదా ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్, తీర్థయాత్రలకు వెళ్లినా ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలనే ఆత్రుత ఫ్యాన్స్ లో కనిపిస్తుంటుంది. అయితే.. ఫ్యాన్స్ కంటే ముందే విషయం ఏంటనేది నెటిజెన్స్ పసిగట్టేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ టాల్ హీరో రానా తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు. రానాతో పాటు ఆయన భార్య మిహీక బజాజ్ తో పాటు పేరెంట్స్ సురేష్ బాబు, లక్ష్మీ.. సోదరుడు అభిరాం కూడా శ్రీవారి దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక హీరో రానా ఫ్యామిలీ శ్రీవారి మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఇక రానా, మిహీక సాంప్రదాయ దుస్తులలో కనిపించగా.. సురేష్ బాబు, అభిరాం మాల ధరించారు. అయితే.. పెళ్ళైన కొత్తలో నవ దంపతులుగా రానా, మిహీక శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు పెళ్ళై రెండేళ్లు దాటిన తర్వాత మళ్లీ తిరుమలలో కనిపించేసరికి ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమోనని భావించారు ఫ్యాన్స్. కానీ.. ఇటీవలే మిహీక ప్రెగ్నన్సీ వార్తలను కొట్టిపారేసింది. అలాగే సురేష్ బాబు ఏ విశేషం లేదని.. కేవలం ఫ్యామిలీ విజిట్ మాత్రమేనని చెప్పడంతో ఫ్యాన్స్ డీలాపడిపోయారు. మరోవైపు సురేష్ బాబు నిర్మిస్తున్న శాకినీ డాకిని, అహింస సినిమాలు రిలీజ్ కి దగ్గరపడుతుండటంతో ఆ సినిమాల కోసం కూడా పూజలు చేశారేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రానా దంపతులు ఫ్యామిలీతో కలిసి తిరుమల దర్శనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.