సినీ తారల దాకా ఎందుకు చిన్న చిన్న సెలబ్రిటీలు కూడా కాస్త గుర్తింపు వచ్చాక.. సామాన్యుల మాదిరి బతకడం చాలా కష్టం. సాధారణ ప్రజలతో కలిసి పోయి.. వారితో ప్రయాణం చేయడం చాలా అరుదు. ఇక పండుగ వేళ తమ ఇంట్లో వాళ్లతో కాకుండా బయటి వాళ్లతో సెలబ్రేట్ చేసుకోవడం అంటే అసలు జరిగే పనే కాదు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఓ హీరోయిన్ రాఖీ పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టి మంచి మనసు చాటుకుంది. పైగా వారి ఆటోలో ప్రయాణించే మహిళలను క్షేమంగా గమ్యం చేర్చడమే తనకిచ్చే గిఫ్ట్ అని ఆటో డ్రైవర్లను కోరింది. తనకు సోదరులు లేరని.. అందుకే ఇలా ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టినట్లు వెల్లడించింది. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..
హార్ట్ అటాక్ మూవీ సినిమతో కుర్రకారు గుండెను కొల్లగొట్టింది హీరోయిన్ అదా శర్మ. ఆ తరువాత వరుస సినిమాలు చేసింది. కానీ ఇప్పటి వరకు అదా ఖాతాలో సరైన హిట్ పడలేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్గా ఉంటుంది అదా శర్మ. విభిన్న గెటప్లో ఫోటో షూట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా రక్షా బంధన్ పండుగ రోజు అదా చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రక్షా బంధన్ సందర్భంగా అదా శర్మ.. ముంబై రోడ్ల మీద ఆటోలో ప్రయాణం చేసింది. అంతేకాక ఆటో డ్రైవర్లకు రాఖీ కూడా కట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్చేయడంతో అవి ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా అదా శర్మ మాట్లాడుతూ.. ‘‘నాకు సోదరులు లేరు. అందుకే ఇలా ఆటో డ్రైవర్లకు రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నాలాంటి అమ్మాయిలు ముంబై రోడ్ల మీద సురక్షితంగా ప్రయాణం చేయగల్గుతున్నారంటే.. ఆటో డ్రైవర్లే కారణం. ఇలాంటి మంచి మనసున్న ఆటో డ్రైవర్లున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వారి పట్ల నా కృతజ్ఞత తెలియజేయడం కోసం ఇలా రాఖీ కట్టాను. బదులుగా వారి ఆటోల్లో ప్రయాణించే వారిని సురక్షితంగా గమ్యం చేర్చమని కోరాను’’ అంటూ చెప్పుకొచ్చింది అదా శర్మ. ఆమె చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.