పవన్ కల్యాణ్.. అటు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఇటు జనసేన పార్టీ అధినేతగా ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూ ఏపీలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలకు దగ్గరగా ఉంటూ వారిలో చైతన్యం నింపుతున్నారు.
తాజాగా పవన్ తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన మీటింగ్లో అభిమాని అత్యుత్సాహం వల్ల పవన్ కు గాయమైన విషయం తెలిసిందే. ఆ ఘటనపై పవన్ కూడా స్పందించారు. “ఒక్కోసారి మీ అభిమానం వల్ల నాకు గాయాలవుతున్నాయి. నాపై మీకున్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, మీ అభిమానం నన్ను చంపేయకూడదు అర్థం చేసుకోండి” అంటూ స్పందించడం చూశాం.
ఆ తర్వాత కూడా పవన్ పర్యటనలు చేశారు. వాతావరణం సరిగ్గా లేకపోయినా, వర్షాలు కురుస్తున్నా పవన్ వరుస పర్యటనలు చేశారు. అలా వర్షాల్లో తడవడం వల్ల బాగా జ్వరం వచ్చినట్లు, వెన్ను నొప్పి కూడా అధికమైనట్లు చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైద్యులు తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ క్రిష్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతం’ సినిమా రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించి నటించాడు కూడా. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ ఈ సినిమా చేయనున్నాడు. పవన్ ఆరోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.