ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాంపై చీటింగ్ కేసు నమోదైంది. శివరామ్.. తన కంపెనీలో పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు కోర్టు ను ఆశ్రయించారు. దీంతో బాధితుల అభ్యర్ధనకు స్పందించిన కోర్టు శివరాంపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వివరించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తదే..
కోడెల శివరాంకు చెందిన ఇన్ ఫ్రా కంపెనీలో 2016లో తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన యలవర్తి సునీత రూ.26,25,000, పాలడుగు బాల వెంకట సురేష్ రూ. 24,25000 పెట్టారు. అంతే కాక వాళ్లుకు ప్రతిఫలంతో పాటు పెట్టుబడి డబ్బులు 2017లో ఇచ్చే విధంగా ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే సునీత, సురేష్ లు డబ్బులిచ్చి ఏడాది దాటిపోవడంతో.. శివరాం వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించాలని అడిగారు. ఇంతో ఇస్తానంటూనే వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. తరువాత ఎన్నిసార్లు అడిగిన స్పందించకపోవడంతో బాధితులు విసిగిపోయారు. ఇలా దాదాపు ఐదేళ్లు వేచి చూసిన కోడెల శివరాం నుంచి స్పందనలేదు. దీంతో బాధితులు ఇద్దరు తెనాలి కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఎస్సై ఏడుకొండలు కేసు నమోదు చేశారు.
గతంలోనూ కోడెల శివరాం పై అనేక కేసులు ఉన్నాయి. సురేషే, సునీతల లాగామరోకొంత మంది కూడా కోడెల శివరాం తమ నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ లో అకారణంగా డబ్బులు వసూలు చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని.. ఇలా అనేక రకాల కారణాలతో మొత్తం 10 ఫిర్యాదులు అందాయని పోలీసుల తెలిపారు. తాజాగా బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఆయనపై చీటింగ్ కేసు నమోదు అయింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Harbhajan Singh, Gautam Gambhir: స్టార్ క్రికెటర్లు హర్భజన్, గంభీర్ మధ్యలో తెలుగు ఎంపీ!
ఇదీ చదవండి: AP Government: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానిక…